టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇక్కడే సెటిల్ అవుదామనుకున్నారు. సౌత్ సినిమాల్లో నటించిందే తప్ప బాలీవుడ్ కి ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ఆమెకి నేషనల్ వైడ్ గా గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ సమయంలో సామ్ ని వెతుక్కుంటూ బాలీవుడ్ ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ సమంత మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు తన దృష్టి బాలీవుడ్ పై పడింది.
ఎప్పుడైతే తన భర్త నాగచైతన్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారో.. అప్పటినుంచి ఆమె బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. చాలా నెలల క్రితమే సమంత ముంబైలో ఓ పీఆర్ ఏజెన్సీను నియమించుకున్నారు. తనకు సంబంధించిన వార్తలు ఎక్కువగా పబ్లిష్ అయ్యేలా చూసుకుంటూ వస్తున్నారు సమంత. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా చాలా మంది కోసం ముంబై పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.
ఇప్పుడు సమంత కూడా బాలీవుడ్ లో తన మార్కెట్ ను బిల్డ్ చేసుకునే పనిలో పడింది. ఇంతకముందు ఆమె కార్పొరేట్ బ్రాండ్స్ ను పొందడానికి నేషనల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తెగ ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆ పబ్లిసిటీ పనులు బాగానే జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
This post was last modified on October 26, 2021 10:42 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…