టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇక్కడే సెటిల్ అవుదామనుకున్నారు. సౌత్ సినిమాల్లో నటించిందే తప్ప బాలీవుడ్ కి ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ఆమెకి నేషనల్ వైడ్ గా గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ సమయంలో సామ్ ని వెతుక్కుంటూ బాలీవుడ్ ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ సమంత మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు తన దృష్టి బాలీవుడ్ పై పడింది.
ఎప్పుడైతే తన భర్త నాగచైతన్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారో.. అప్పటినుంచి ఆమె బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. చాలా నెలల క్రితమే సమంత ముంబైలో ఓ పీఆర్ ఏజెన్సీను నియమించుకున్నారు. తనకు సంబంధించిన వార్తలు ఎక్కువగా పబ్లిష్ అయ్యేలా చూసుకుంటూ వస్తున్నారు సమంత. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా చాలా మంది కోసం ముంబై పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.
ఇప్పుడు సమంత కూడా బాలీవుడ్ లో తన మార్కెట్ ను బిల్డ్ చేసుకునే పనిలో పడింది. ఇంతకముందు ఆమె కార్పొరేట్ బ్రాండ్స్ ను పొందడానికి నేషనల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తెగ ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆ పబ్లిసిటీ పనులు బాగానే జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
This post was last modified on October 26, 2021 10:42 am
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…