టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇక్కడే సెటిల్ అవుదామనుకున్నారు. సౌత్ సినిమాల్లో నటించిందే తప్ప బాలీవుడ్ కి ఎప్పుడూ వెళ్లాలనుకోలేదు. కానీ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ఆమెకి నేషనల్ వైడ్ గా గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ సమయంలో సామ్ ని వెతుక్కుంటూ బాలీవుడ్ ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ సమంత మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు తన దృష్టి బాలీవుడ్ పై పడింది.
ఎప్పుడైతే తన భర్త నాగచైతన్య నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారో.. అప్పటినుంచి ఆమె బాలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు. చాలా నెలల క్రితమే సమంత ముంబైలో ఓ పీఆర్ ఏజెన్సీను నియమించుకున్నారు. తనకు సంబంధించిన వార్తలు ఎక్కువగా పబ్లిష్ అయ్యేలా చూసుకుంటూ వస్తున్నారు సమంత. టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, రష్మిక ఇలా చాలా మంది కోసం ముంబై పీఆర్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి.
ఇప్పుడు సమంత కూడా బాలీవుడ్ లో తన మార్కెట్ ను బిల్డ్ చేసుకునే పనిలో పడింది. ఇంతకముందు ఆమె కార్పొరేట్ బ్రాండ్స్ ను పొందడానికి నేషనల్ మీడియాలో పబ్లిసిటీ కోసం తెగ ప్రయత్నించేవారు. ఇప్పుడు ఆ పబ్లిసిటీ పనులు బాగానే జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…