పూరి జగన్నాథ్ ఎలాంటి స్థితిలోనూ తొణకని వ్యక్తి లాగే కనిపిస్తుంటాడు. ఒక టైంలో తాను నమ్మిన వ్యక్తి ఆర్థికంగా తనను ముంచేస్తే.. ఆ స్థితిలోనూ చాలా దృఢంగా నిలబడ్డాడు పూరి. ఆ టైంలో మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ చాలా మామూలుగానే కనిపించాడు.
దర్శకుడు కావడానికి ముందు, తర్వాత ఎన్నో ఎదురు దెబ్బల్ని తట్టుకుని నిలబడ్డం వల్ల వచ్చిన స్థిరత్వం వల్ల కావచ్చు పూరి ఎప్పుడూ పెద్దగా ఎమోషనల్ అయినట్లు కనిపించాడు. అలాంటి వాడు మొన్న ‘రొమాంటిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో తన కొడుకు ఆకాశ్ చాలా ఉద్వేగభరితంగా మాట్లడుతుంటే.. పూరి కొంచెం కదిలిపోయాడు.
ఆయన కళ్లల్లో సన్నని కన్నీటి ధార కనిపించింది. ఎంతటి వారైనా సరే.. తమ బిడ్డల విషయంలో ఎమోషనల్ అయిపోతారనేందుకు పూరి రుజువుగా కనిపించాడు ఆ రోజు. కాగా ‘రొమాంటిక్’ సినిమా ఫస్ట్ కాపీ చూసినపుడు కూడా పూరి ఇంతే ఎమోషనల్ అయ్యాడట.
సినిమా మొత్తం చూసి బయటికి వచ్చాక పూరి తన ముందు ఏడ్చేసినట్లు దర్శకుడు అనిల్ పాడూరి తెలిపాడు. ‘అమ్మ నాన్న తమిళ అమ్మాయి’ తర్వాత తన కెరీర్లో అత్యంత ఎమోషన్ ఉన్న సినిమానే అని.. సినిమా చాలా బాగా తీశావని పూరి తనను అభినందించినట్లు అనిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ‘రొమాంటిక్’ సక్సెస్ పట్ల పూరి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లు అనిల్ వెల్లడించాడు.
పూరి స్క్రిప్టుతో తెరకెక్కిన సినిమా కాబట్టి కచ్చితంగా ఇందులో ఆయన శైలి కనిపిస్తుందని.. తాను కాకుండా ఎవరు తీసినా అలాగే జరుగుతుందని అనిల్ అన్నాడు. తాను కళ్యాణ్ రామ్తో కలిసి పదేళ్ల కిందటే ఒక విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను మొదలుపెట్టి దాన్ని విజయవంతంగా నడుపుతున్నానని.. పూరితో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉందని.. తన రైటింగ్ నచ్చి, తాను రాసిన‘రొమాంటిక్’ కథను తనకు ఇచ్చి డైరెక్ట్ చేయమన్నాడని.. ఆయన నమ్మకాన్ని కచ్చితంగా నిలబెడతానని అనిల్ ధీమా వ్యక్తం చేశాడు.
This post was last modified on October 25, 2021 6:00 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ…
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…
బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్…