Movie News

ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ‘రొమాంటిక్’ డైరెక్టర్!

ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న ‘రొమాంటిక్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు అనిల్ పాదూరి. దాదాపు పదేళ్లకు పైగా వీఎఫ్ఎక్స్ రంగంలో అనుభవం ఉన్న అనిల్ పాదూరికి దర్శకత్వం వైపు మనసు లాగడానికి కారణం పూరి జగన్నాద్ అనే చెప్పాలి. తను రాసేవి పూరి జగన్నాద్ కి బాగా నచ్చేవని అనిల్ అన్నారు. ‘ఇజం’ సినిమా సమయంలోనే ఓ కథను డైరెక్ట్ చేయమని పూరి చెబితే.. నమ్మకం లేక ఒప్పుకోలేదని.. ఇప్పుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నట్లు చెప్పారు అనిల్.

ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ రాయడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు పూరి. ఇప్పటివరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్ చూస్తుంటే పూరి జగన్నాద్ మార్క్ కనిపిస్తోంది. కథ-మాటలు పూరి గారివే అయినప్పటికీ ఈ సినిమాలో డైరెక్టర్ గా తన మార్క్ ఉంటుందని చెబుతున్నారు అనిల్. సినిమా చూస్తే పూరిగారు తీసినట్లుగా ఉండదని అన్నారు. ఈ సినిమా చూసిన పూరిగారు నా కథలో ఇంత ఎమోషన్ ఉందా..? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు.

ట్రైలర్ చూసిన ఇది యూత్ సినిమా అనుకోవద్దని.. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఉంటుందని అన్నారు. పూరి డైరెక్ట్ చేసిన ‘టెంపర్’ సినిమాకి అనిల్ పాదూరి వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ సోదరుడు, నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి అనిల్ ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీను మొదలుపెట్టారు. కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో దర్శకుడిగా పరిచయం కావాలని అనుకున్నారు అనిల్. కానీ వీఎఫ్ఎక్స్ పనులతో బిజీగా ఉండడంతో కుదరలేదు. ఆ తరువాత ‘రొమాంటిక్’ సినిమా ఆఫర్ వచ్చింది. ఇప్పుడు దర్శకుడిగా తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే చేస్తానని స్పష్టం చేశారు అనిల్ పాదూరి.

This post was last modified on October 24, 2021 9:39 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

6 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago