రంగస్థలం తర్వాత మళ్ళీ సెట్స్ మీదకు వెళ్ళడానికి సుకుమార్ కి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొదట్లో మహేష్ తో అనుకున్న సినిమా ముందుకి కదలకపోవడంతో అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కూడా ఏడాది పైగా వేచి చూసాక కానీ బన్నీ ఫ్రీ అవలేదు. తీరా షూటింగ్ కి వెళ్లొచ్చు అనుకునేంతలో కరోనా కలకలం వచ్చి పడింది. మిగతా వాళ్ళు షూటింగ్ ఇక్కడే ఏదో ఒక మూల చేసేసుకుందాం అనుకుంటున్నారు.
కానీ పుష్ప షూటింగ్ అలా ఎక్కడో అక్కడ చేసుకోవడానికి లేదు. కచ్చితంగా అడవులలో షూటింగ్ చేయాలి కనుక పుష్ప ఇప్పట్లో మొదలయ్యే వీలు లేదు. అల్లు అర్జున్ అయితే మరో నాలుగు నెలల పాటు ఎదురు చూడక తప్పదని ఫిక్స్ అయిపోయాడట. కాకపోతే సుకుమార్ మాత్రం ఏమైనా చేయవచ్చునేమో అని ఆర్ట్ డైరెక్టర్లతో సమాలోచనలు జరుపుతున్నాడట. మరోవైపు రష్మిక కూడా షూటింగ్ కి ఇప్పట్లో రాలేనని చెప్పిందట. చూస్తోంటే సుకుమార్ కి మరి కొన్ని నెలల ఎదురుచూపులు తప్పేటట్టు లేవు.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…