వచ్చే ఏడాది సంక్రాంతిలో సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, మహేష్ ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇలా భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంక్రాంతి రేసుకి సిద్ధమయ్యాయి. రిలీజ్ డేట్స్ ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలు కాకుండా ‘ఆచార్య’, ‘ఎఫ్ 3’ ఇలా చాలా సినిమాలు సంక్రాంతి డేట్ పై కన్నేశాయి. కానీ ఉన్నట్టుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది యూనిట్.
దీంతో సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్లక తప్పదని అందరూ అనుకున్నారు. కానీ ‘రాధేశ్యామ్’ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని ఫిక్సయింది. ఇక మిగిలిన సినిమాలు డేట్లు సర్దుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అనీల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘ఎఫ్3’ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లు ఈరోజు అధికారికంగా వెల్లడించారు.
ఇక మహేష్, పవన్ సినిమాలను కూడా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 28న ‘సర్కారు వారి పాట’ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలానే మార్చి 31న ‘భీమ్లా నాయక్’ వస్తుందని అంటున్నారు. అంటే ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక సమ్మర్ లో పాన్ ఇండియా సినిమాలు ఎలాగో ఉంటాయి.
This post was last modified on October 24, 2021 1:35 pm
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…