వచ్చే ఏడాది సంక్రాంతిలో సందడి చేయడానికి చాలా సినిమాలు రెడీ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, మహేష్ ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇలా భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంక్రాంతి రేసుకి సిద్ధమయ్యాయి. రిలీజ్ డేట్స్ ను కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలు కాకుండా ‘ఆచార్య’, ‘ఎఫ్ 3’ ఇలా చాలా సినిమాలు సంక్రాంతి డేట్ పై కన్నేశాయి. కానీ ఉన్నట్టుండి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరి 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది యూనిట్.
దీంతో సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలన్నీ వెనక్కి వెళ్లక తప్పదని అందరూ అనుకున్నారు. కానీ ‘రాధేశ్యామ్’ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని ఫిక్సయింది. ఇక మిగిలిన సినిమాలు డేట్లు సర్దుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అనీల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ‘ఎఫ్3’ సినిమా ఫిబ్రవరి 25న విడుదల చేయబోతున్నట్లు ఈరోజు అధికారికంగా వెల్లడించారు.
ఇక మహేష్, పవన్ సినిమాలను కూడా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 28న ‘సర్కారు వారి పాట’ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అలానే మార్చి 31న ‘భీమ్లా నాయక్’ వస్తుందని అంటున్నారు. అంటే ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వరుసగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక సమ్మర్ లో పాన్ ఇండియా సినిమాలు ఎలాగో ఉంటాయి.
This post was last modified on October 24, 2021 1:35 pm
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…