మిగిలిన పండుగలు ఎలా ఉన్నా.. తమిళులు ఎంతో ఆర్భాటంగా చేసుకునే పర్వదినాల్లో దీపావళి ముందుంటుంది. మిగిలిన పండుగల్నిఎలా చేసుకున్నా.. దీపావళిని భారీగా చేసుకోవటం తెలిసిందే. దీనికి తగ్గట్లే ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. వచ్చే నాలుగున రానున్న దీపావళికి.. కోలీవుడ్ లో సినిమా పండుగ కాస్తా పోటీగా మారింది. స్టార్ హీరో విశాల్ తో పాటు మరో యువ అగ్ర హీరో ఆర్య నటించిన ‘ఎనిమి’కి ఇప్పుడు కొత్త సమస్యలు ఎదురవుతున్నట్లుగా చెబుతున్నారు.
విశాల్ అంటే తమిళనాడులో అతనికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి హీరో నటించిన సినిమా విడుదల అవుతుందంటే.. థియేటర్లు అసలు సమస్యే కాదు. కానీ.. ఎనిమి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను దీపావళికి ఒక రోజు ముందుగా నవంబరు 4న రిలీజ్ చేద్దామని చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘‘అన్నాత్త’’ మూవీని రిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మూవీ విడుదల అంటే.. అదెంత భారీగా ఉంటుందో తెలిసిందే. దీంతో.. విశాల్ మూవీకి థియేటర్లు దొరకని పరిస్థితి. దీంతో.. ఈ మూవీ టీం ఇబ్బందులకు గురవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే రజనీ.. విశాల్ సినిమాలు పోటీ పడుతున్న వేళ.. ఈ రేసులో తానెందుకన్న ముందస్తు జాగ్రత్తతో శింబు నటించిన ‘మనాడు’ రిలీజ్ నుంచి తప్పుకుంది.
కానీ.. విశాల్ – ఆర్య నటించిన ఎనిమి మూవీ మాత్రం రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రజనీ మూవీ విడుదల అవుతున్న వేళ.. విడుదల అవుతున్న విశాల్ మూవీకి కనీసం 250థియేటర్లను కేటాయించాలంటూ ఈ చిత్ర నిర్మాత మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అదిప్పుడు వైరల్ గా మారింది. విశాల్ సినిమా కోసం థియేటర్లు దొరకపోవటమా? అన్న ఆశ్చర్యం ఇప్పుడు వ్యక్తమవుతోంది.
This post was last modified on October 24, 2021 11:44 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…