బాహుబలితో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన హీరో ప్రభాస్. దేశంలో వన్ అండ్ ఓన్లీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అంటూ మన ప్రభాస్ను బాలీవుడ్ మీడియా వాళ్లు పొగుడుతుంటే యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ఐతే బాహుబలి ద్వారా సంపాదించిన ఈ అసాధారణ ఇమేజ్ను ప్రభాస్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాడనే అభిప్రాయం చాలామందిలో ఉంది.
మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న అతను.. వాళ్ల అభిరుచికి తగ్గ సినిమాలు చేయట్లేదనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. సాహో సినిమాలో బోలెడంత యాక్షన్ ఉంది కానీ.. ఆ కథ మాస్కు అంతగా కనెక్టయ్యేది కాదు. అది మన కథ అనుకునేలా ఉండదు. హాలీవుడ్ థ్రిల్లర్ల స్ఫూర్తితో సుజీత్ ఏదో ట్రై చేశాడు కానీ.. అది మన ప్రేక్షకులకు రుచించలేదు.
దీని తర్వాత అయినా ప్రభాస్ తన అభిమానులకు ఏం కావాలో అది అందిస్తాడనుకుంటే.. రాధేశ్యామ్ అలాంటి ఆశలేమీ రేకెత్తించట్లేదు. తనకున్న ఇమేజ్కు భిన్నంగా క్లాస్ లవ్ స్టోరీ ట్రై చేసినట్లున్నాడు ప్రభాస్. దాన్నయినా సామాన్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా, వారిని అలరించేలా కొంచెం మాస్ టచ్ ఇచ్చి తీశారా అంటే అలాంటి సంకేతాలూ కనిపించడం లేదు.
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ వారెవా అనిపించినా.. ఈ టీజర్ కాన్సెప్ట్ ఏంటన్నది మాత్రం జనాలకు అర్థం కాలేదు. ఇంగ్లిష్లో సగటు ప్రేక్షకులకు అర్థం కాని విధంగా ఏదో డైలాగ్ చెప్పాడు ప్రభాస్. విజువల్గా ఎంత బాగున్నప్పటికీ.. ఇది మాస్ ప్రేక్షకులకు అర్థమయ్యే సినిమా కాదేమో.. మరీ క్లాస్గా ఉండి ఈ వర్గం ప్రేక్షకులకు నచ్చదేమో అన్న భయాలు కలిగింది టీజర్ చూస్తుంటే. టీజర్ టాప్ క్లాస్ అని, విజువల్స్ సూపరని ఎంత చెప్పుకున్నప్పటికీ లోలోన అయితే ప్రభాస్ అభిమానుల్లో కొంచెం దడపుట్టించింది రాధేశ్యామ్ టీజర్.
This post was last modified on October 24, 2021 12:41 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…