ప్రగ్యా జైశ్వాల్ అనే అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘కంచె’ మూవీతో. విలక్షణ దర్శకుడు క్రిష్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనదగ్గ ఈ మూవీలో కథానాయిక పాత్రలో ప్రగ్యా ఆశ్చర్యకర నటనను ప్రదర్శించింది. అందంతోనూ ఆకట్టుకుంది. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న ఓ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా ఆ పాత్రను పోషించడం ఆశ్చర్యపరిచింది.
ఆ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది ప్రగ్యా. ఈ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రగ్యా కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేసింది.
ఐతే ఆమె నేపథ్యం తెలిసిన వాళ్లకు తన ట్వీట్ నోరెళ్లబెట్టేలా చేసింది. ‘తొలి’ విషయాలు ఎప్పుడూ ప్రత్యేకం అని ఆమె ట్వీట్ చేయడం గమనార్హం. అంటే.. ‘కంచె’ కథానాయికగా తన తొలి చిత్రం అనే సంకేతాన్ని ప్రగ్యా ఇచ్చిందన్నమాట.
కానీ నిజానికి ప్రగ్యాకు ‘కంచె’ తొలి చిత్రం కాదు. కనీసం తెలుగులో ఆమెకిది తొలి సినిమానా అంటే అది కూడా కాదు. తెలుగులో ఆమె అప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. ‘డేగ’ ఆమె తొలి చిత్రం కాగా.. గత ఏడాది బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచిన అభిజిత్ కథానాయకుడిగా నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే మరో సినిమాలోనూ ప్రగ్యా కథానాయికగా నటించింది.
ఐతే ఈ రెండు చిత్రాలు అంతగా ఆడలేదు. జనాల దృష్టిలో పడలేదు. అప్పుడే క్రిష్.. ప్రగ్యాకు ‘కంచె’లో అవకాశం ఇచ్చాడు. తన కెరీర్లో మరిచిపోలేని పాత్ర, సినిమాను అందించాడు. ఆ తర్వాత ప్రగ్యా ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే.
ప్రగ్యాకు గుర్తింపు తెచ్చింది ‘కంచె’నే కావచ్చు కానీ.. అంతకుముందు చేసిన సినిమాలను చరిత్రలో కలిపేయాలని చూడటమే ఆశ్చర్యం. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే.. ‘కంచె’ సినిమాకు ఉత్తమ నూతన నటిగా ఫిలిం ఫేర్ అవార్డిస్తే ప్రగ్యా ఇది తన డెబ్యూ మూవీ కాదని చెప్పకుండా ఆ అవార్డును తీసేసుకుంది.
This post was last modified on October 23, 2021 2:01 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…