ప్రగ్యా జైశ్వాల్ అనే అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘కంచె’ మూవీతో. విలక్షణ దర్శకుడు క్రిష్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనదగ్గ ఈ మూవీలో కథానాయిక పాత్రలో ప్రగ్యా ఆశ్చర్యకర నటనను ప్రదర్శించింది. అందంతోనూ ఆకట్టుకుంది. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న ఓ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా ఆ పాత్రను పోషించడం ఆశ్చర్యపరిచింది.
ఆ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది ప్రగ్యా. ఈ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రగ్యా కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేసింది.
ఐతే ఆమె నేపథ్యం తెలిసిన వాళ్లకు తన ట్వీట్ నోరెళ్లబెట్టేలా చేసింది. ‘తొలి’ విషయాలు ఎప్పుడూ ప్రత్యేకం అని ఆమె ట్వీట్ చేయడం గమనార్హం. అంటే.. ‘కంచె’ కథానాయికగా తన తొలి చిత్రం అనే సంకేతాన్ని ప్రగ్యా ఇచ్చిందన్నమాట.
కానీ నిజానికి ప్రగ్యాకు ‘కంచె’ తొలి చిత్రం కాదు. కనీసం తెలుగులో ఆమెకిది తొలి సినిమానా అంటే అది కూడా కాదు. తెలుగులో ఆమె అప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. ‘డేగ’ ఆమె తొలి చిత్రం కాగా.. గత ఏడాది బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచిన అభిజిత్ కథానాయకుడిగా నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే మరో సినిమాలోనూ ప్రగ్యా కథానాయికగా నటించింది.
ఐతే ఈ రెండు చిత్రాలు అంతగా ఆడలేదు. జనాల దృష్టిలో పడలేదు. అప్పుడే క్రిష్.. ప్రగ్యాకు ‘కంచె’లో అవకాశం ఇచ్చాడు. తన కెరీర్లో మరిచిపోలేని పాత్ర, సినిమాను అందించాడు. ఆ తర్వాత ప్రగ్యా ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే.
ప్రగ్యాకు గుర్తింపు తెచ్చింది ‘కంచె’నే కావచ్చు కానీ.. అంతకుముందు చేసిన సినిమాలను చరిత్రలో కలిపేయాలని చూడటమే ఆశ్చర్యం. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే.. ‘కంచె’ సినిమాకు ఉత్తమ నూతన నటిగా ఫిలిం ఫేర్ అవార్డిస్తే ప్రగ్యా ఇది తన డెబ్యూ మూవీ కాదని చెప్పకుండా ఆ అవార్డును తీసేసుకుంది.
This post was last modified on October 23, 2021 2:01 pm
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…