ప్రగ్యా జైశ్వాల్ అనే అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘కంచె’ మూవీతో. విలక్షణ దర్శకుడు క్రిష్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనదగ్గ ఈ మూవీలో కథానాయిక పాత్రలో ప్రగ్యా ఆశ్చర్యకర నటనను ప్రదర్శించింది. అందంతోనూ ఆకట్టుకుంది. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న ఓ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా ఆ పాత్రను పోషించడం ఆశ్చర్యపరిచింది.
ఆ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది ప్రగ్యా. ఈ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రగ్యా కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేసింది.
ఐతే ఆమె నేపథ్యం తెలిసిన వాళ్లకు తన ట్వీట్ నోరెళ్లబెట్టేలా చేసింది. ‘తొలి’ విషయాలు ఎప్పుడూ ప్రత్యేకం అని ఆమె ట్వీట్ చేయడం గమనార్హం. అంటే.. ‘కంచె’ కథానాయికగా తన తొలి చిత్రం అనే సంకేతాన్ని ప్రగ్యా ఇచ్చిందన్నమాట.
కానీ నిజానికి ప్రగ్యాకు ‘కంచె’ తొలి చిత్రం కాదు. కనీసం తెలుగులో ఆమెకిది తొలి సినిమానా అంటే అది కూడా కాదు. తెలుగులో ఆమె అప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. ‘డేగ’ ఆమె తొలి చిత్రం కాగా.. గత ఏడాది బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచిన అభిజిత్ కథానాయకుడిగా నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే మరో సినిమాలోనూ ప్రగ్యా కథానాయికగా నటించింది.
ఐతే ఈ రెండు చిత్రాలు అంతగా ఆడలేదు. జనాల దృష్టిలో పడలేదు. అప్పుడే క్రిష్.. ప్రగ్యాకు ‘కంచె’లో అవకాశం ఇచ్చాడు. తన కెరీర్లో మరిచిపోలేని పాత్ర, సినిమాను అందించాడు. ఆ తర్వాత ప్రగ్యా ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే.
ప్రగ్యాకు గుర్తింపు తెచ్చింది ‘కంచె’నే కావచ్చు కానీ.. అంతకుముందు చేసిన సినిమాలను చరిత్రలో కలిపేయాలని చూడటమే ఆశ్చర్యం. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే.. ‘కంచె’ సినిమాకు ఉత్తమ నూతన నటిగా ఫిలిం ఫేర్ అవార్డిస్తే ప్రగ్యా ఇది తన డెబ్యూ మూవీ కాదని చెప్పకుండా ఆ అవార్డును తీసేసుకుంది.
This post was last modified on October 23, 2021 2:01 pm
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…