ప్రగ్యా జైశ్వాల్ అనే అమ్మాయి అందరి దృష్టినీ ఆకర్షించింది ‘కంచె’ మూవీతో. విలక్షణ దర్శకుడు క్రిష్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనదగ్గ ఈ మూవీలో కథానాయిక పాత్రలో ప్రగ్యా ఆశ్చర్యకర నటనను ప్రదర్శించింది. అందంతోనూ ఆకట్టుకుంది. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న ఓ అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా ఆ పాత్రను పోషించడం ఆశ్చర్యపరిచింది.
ఆ సినిమాకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకుంది ప్రగ్యా. ఈ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ప్రగ్యా కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేసింది.
ఐతే ఆమె నేపథ్యం తెలిసిన వాళ్లకు తన ట్వీట్ నోరెళ్లబెట్టేలా చేసింది. ‘తొలి’ విషయాలు ఎప్పుడూ ప్రత్యేకం అని ఆమె ట్వీట్ చేయడం గమనార్హం. అంటే.. ‘కంచె’ కథానాయికగా తన తొలి చిత్రం అనే సంకేతాన్ని ప్రగ్యా ఇచ్చిందన్నమాట.
కానీ నిజానికి ప్రగ్యాకు ‘కంచె’ తొలి చిత్రం కాదు. కనీసం తెలుగులో ఆమెకిది తొలి సినిమానా అంటే అది కూడా కాదు. తెలుగులో ఆమె అప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. ‘డేగ’ ఆమె తొలి చిత్రం కాగా.. గత ఏడాది బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచిన అభిజిత్ కథానాయకుడిగా నటించిన ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే మరో సినిమాలోనూ ప్రగ్యా కథానాయికగా నటించింది.
ఐతే ఈ రెండు చిత్రాలు అంతగా ఆడలేదు. జనాల దృష్టిలో పడలేదు. అప్పుడే క్రిష్.. ప్రగ్యాకు ‘కంచె’లో అవకాశం ఇచ్చాడు. తన కెరీర్లో మరిచిపోలేని పాత్ర, సినిమాను అందించాడు. ఆ తర్వాత ప్రగ్యా ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే.
ప్రగ్యాకు గుర్తింపు తెచ్చింది ‘కంచె’నే కావచ్చు కానీ.. అంతకుముందు చేసిన సినిమాలను చరిత్రలో కలిపేయాలని చూడటమే ఆశ్చర్యం. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే.. ‘కంచె’ సినిమాకు ఉత్తమ నూతన నటిగా ఫిలిం ఫేర్ అవార్డిస్తే ప్రగ్యా ఇది తన డెబ్యూ మూవీ కాదని చెప్పకుండా ఆ అవార్డును తీసేసుకుంది.
This post was last modified on October 23, 2021 2:01 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…