సెలబ్రిటీల ఇళ్లల్లో పని చేసే వారికి ఎలాంటి గుర్తింపు ఉంటుంది? అన్న సందేహం కలుగుతుంది. యజమాని సంబంధం కాకుండా మానవీయ సంబంధాలు నెరపే వారు తక్కువే. ఎవరో కొందరే తమతో పాటు.. తమ కుటుంబంగా వారిని చూసుకుంటూ ఉంటారు.
ఈ మాటకు బలం చేకూరేలా రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీలో జరిగిన ఒక కార్యక్రమం చెప్పేస్తుంది. తమ ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్న మహిళకు రెబల్ స్టార్ ఇంటి సభ్యులు ఊహించని కానుకను అందించారు.
తమ ఇంట్లో పాతికేళ్లుగా పని చేస్తున్న మహిళకు.. పాతికేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఒక అందమైన కేక్ ను కట్ చేయించి ఆమెను సంతోషపెట్టారు. ఒక బహుమతిని కూడా అందించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాల్ని రాధేశ్యామ్ నిర్మాత కమ్ రెబల్ స్టార్ కుమార్తె ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
పాతికేళ్లుగా తమ కోసం చాలా చేశారంటూ.. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ పెట్టిన పోస్టు.. దానికి జత చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రెబల్ స్టార్ ఇంట్లో పని చేసే వారిని.. తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేయటాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేయించారు. దీంతో పాటు ఆమెకు కృష్ణం రాజు సతీమణి బంగారు గొలుసును బహుమతిగా అందజేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
నిజమే కదా… 25 సంవత్సరాలు అంటూ మోర్ దాన్ ఎ జనరేషన్. ఒక జీవితం తమ కుటుంబానికి అంకితం చేసినందుకు ఆమెకు తగిన గౌరవం ఇవ్వడం… కృష్ణంరాజు కుటుంబం మానవీయత.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…