సెలబ్రిటీల ఇళ్లల్లో పని చేసే వారికి ఎలాంటి గుర్తింపు ఉంటుంది? అన్న సందేహం కలుగుతుంది. యజమాని సంబంధం కాకుండా మానవీయ సంబంధాలు నెరపే వారు తక్కువే. ఎవరో కొందరే తమతో పాటు.. తమ కుటుంబంగా వారిని చూసుకుంటూ ఉంటారు.
ఈ మాటకు బలం చేకూరేలా రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీలో జరిగిన ఒక కార్యక్రమం చెప్పేస్తుంది. తమ ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్న మహిళకు రెబల్ స్టార్ ఇంటి సభ్యులు ఊహించని కానుకను అందించారు.
తమ ఇంట్లో పాతికేళ్లుగా పని చేస్తున్న మహిళకు.. పాతికేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఒక అందమైన కేక్ ను కట్ చేయించి ఆమెను సంతోషపెట్టారు. ఒక బహుమతిని కూడా అందించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాల్ని రాధేశ్యామ్ నిర్మాత కమ్ రెబల్ స్టార్ కుమార్తె ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
పాతికేళ్లుగా తమ కోసం చాలా చేశారంటూ.. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ పెట్టిన పోస్టు.. దానికి జత చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రెబల్ స్టార్ ఇంట్లో పని చేసే వారిని.. తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేయటాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేయించారు. దీంతో పాటు ఆమెకు కృష్ణం రాజు సతీమణి బంగారు గొలుసును బహుమతిగా అందజేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
నిజమే కదా… 25 సంవత్సరాలు అంటూ మోర్ దాన్ ఎ జనరేషన్. ఒక జీవితం తమ కుటుంబానికి అంకితం చేసినందుకు ఆమెకు తగిన గౌరవం ఇవ్వడం… కృష్ణంరాజు కుటుంబం మానవీయత.
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…