సెలబ్రిటీల ఇళ్లల్లో పని చేసే వారికి ఎలాంటి గుర్తింపు ఉంటుంది? అన్న సందేహం కలుగుతుంది. యజమాని సంబంధం కాకుండా మానవీయ సంబంధాలు నెరపే వారు తక్కువే. ఎవరో కొందరే తమతో పాటు.. తమ కుటుంబంగా వారిని చూసుకుంటూ ఉంటారు.
ఈ మాటకు బలం చేకూరేలా రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీలో జరిగిన ఒక కార్యక్రమం చెప్పేస్తుంది. తమ ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్న మహిళకు రెబల్ స్టార్ ఇంటి సభ్యులు ఊహించని కానుకను అందించారు.
తమ ఇంట్లో పాతికేళ్లుగా పని చేస్తున్న మహిళకు.. పాతికేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఒక అందమైన కేక్ ను కట్ చేయించి ఆమెను సంతోషపెట్టారు. ఒక బహుమతిని కూడా అందించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాల్ని రాధేశ్యామ్ నిర్మాత కమ్ రెబల్ స్టార్ కుమార్తె ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
పాతికేళ్లుగా తమ కోసం చాలా చేశారంటూ.. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ పెట్టిన పోస్టు.. దానికి జత చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రెబల్ స్టార్ ఇంట్లో పని చేసే వారిని.. తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేయటాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేయించారు. దీంతో పాటు ఆమెకు కృష్ణం రాజు సతీమణి బంగారు గొలుసును బహుమతిగా అందజేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
నిజమే కదా… 25 సంవత్సరాలు అంటూ మోర్ దాన్ ఎ జనరేషన్. ఒక జీవితం తమ కుటుంబానికి అంకితం చేసినందుకు ఆమెకు తగిన గౌరవం ఇవ్వడం… కృష్ణంరాజు కుటుంబం మానవీయత.
This post was last modified on October 23, 2021 11:46 am
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…