సెలబ్రిటీల ఇళ్లల్లో పని చేసే వారికి ఎలాంటి గుర్తింపు ఉంటుంది? అన్న సందేహం కలుగుతుంది. యజమాని సంబంధం కాకుండా మానవీయ సంబంధాలు నెరపే వారు తక్కువే. ఎవరో కొందరే తమతో పాటు.. తమ కుటుంబంగా వారిని చూసుకుంటూ ఉంటారు.
ఈ మాటకు బలం చేకూరేలా రెబల్ స్టార్ కృష్ణం రాజు ఫ్యామిలీలో జరిగిన ఒక కార్యక్రమం చెప్పేస్తుంది. తమ ఇంట్లో పని మనిషిగా పని చేస్తున్న మహిళకు రెబల్ స్టార్ ఇంటి సభ్యులు ఊహించని కానుకను అందించారు.
తమ ఇంట్లో పాతికేళ్లుగా పని చేస్తున్న మహిళకు.. పాతికేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఒక అందమైన కేక్ ను కట్ చేయించి ఆమెను సంతోషపెట్టారు. ఒక బహుమతిని కూడా అందించారు. దీనికి సంబంధించిన ఆసక్తికర వివరాల్ని రాధేశ్యామ్ నిర్మాత కమ్ రెబల్ స్టార్ కుమార్తె ప్రసీద సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
పాతికేళ్లుగా తమ కోసం చాలా చేశారంటూ.. థ్యాంక్యూ పద్మ ఆంటీ అంటూ పెట్టిన పోస్టు.. దానికి జత చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. రెబల్ స్టార్ ఇంట్లో పని చేసే వారిని.. తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేయటాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమెతో కేక్ కట్ చేయించారు. దీంతో పాటు ఆమెకు కృష్ణం రాజు సతీమణి బంగారు గొలుసును బహుమతిగా అందజేసినట్లుగా తెలుస్తోంది. ఈ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
నిజమే కదా… 25 సంవత్సరాలు అంటూ మోర్ దాన్ ఎ జనరేషన్. ఒక జీవితం తమ కుటుంబానికి అంకితం చేసినందుకు ఆమెకు తగిన గౌరవం ఇవ్వడం… కృష్ణంరాజు కుటుంబం మానవీయత.
This post was last modified on October 23, 2021 11:46 am
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…