‘బొమ్మరిల్లు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు భాస్కర్ ఆ తరువాత ‘ఒంగోలు గిత్త’, ‘ఆరెంజ్’ లాంటి సినిమాలు తీశారు. కానీ అవేవీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత తమిళంలో ఓ సినిమా చేశారు. అదీ పెద్దగా ఆడలేదు. దీంతో అతడికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. చాలా కాలం తరువాత బొమ్మరిల్లు భాస్కర్ కి ఓ ఛాన్స్ వచ్చింది. అదే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
నిజానికి భాస్కర్ తీసిన సినిమా నిర్మాతలకు నచ్చలేదట. దీంతో చాలా సీన్లను రీషూట్ చేయించారు. ఆ తరువాత అక్కినేని నాగార్జున ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని కొన్ని మార్పులు చెప్పారు. అలా రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణం సాగింది. నిర్మాతలు, నాగార్జున చేసిన మార్పులు, చేర్పుల వలనే సినిమా ఆడిందని అంటున్నారు. అందుకే ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్.. దర్శకుడు భాస్కర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
సినిమా మేకింగ్ విషయంలో భాస్కర్ ని బాగా ఇబ్బంది పెట్టమని.. కానీ అనుకున్నది సాధించాడు అంటూ బన్నీ కామెంట్స్ చేశారు. పరోక్షంగా రీషూట్ల గురించే చెప్పారు బన్నీ. ఇప్పుడు భాస్కర్ పై నమ్మకంతో గీతాఆర్ట్స్ సంస్థ మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ హీరోకి సెట్ అయ్యే కథని రెడీ చేసుకోమని చెప్పిందట గీతాఆర్ట్స్ సంస్థ. మొత్తానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ తో భాస్కర్ మరో ఛాన్స్ కొట్టేశాడనే చెప్పాలి. మరి ఈసారి ఎలాంటి కథను రెడీ చేసుకుంటారో చూడాలి!
This post was last modified on October 22, 2021 2:04 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…