‘బొమ్మరిల్లు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న దర్శకుడు భాస్కర్ ఆ తరువాత ‘ఒంగోలు గిత్త’, ‘ఆరెంజ్’ లాంటి సినిమాలు తీశారు. కానీ అవేవీ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత తమిళంలో ఓ సినిమా చేశారు. అదీ పెద్దగా ఆడలేదు. దీంతో అతడికి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. చాలా కాలం తరువాత బొమ్మరిల్లు భాస్కర్ కి ఓ ఛాన్స్ వచ్చింది. అదే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
నిజానికి భాస్కర్ తీసిన సినిమా నిర్మాతలకు నచ్చలేదట. దీంతో చాలా సీన్లను రీషూట్ చేయించారు. ఆ తరువాత అక్కినేని నాగార్జున ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని కొన్ని మార్పులు చెప్పారు. అలా రెండున్నరేళ్ల పాటు ఈ సినిమా నిర్మాణం సాగింది. నిర్మాతలు, నాగార్జున చేసిన మార్పులు, చేర్పుల వలనే సినిమా ఆడిందని అంటున్నారు. అందుకే ఈ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్.. దర్శకుడు భాస్కర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
సినిమా మేకింగ్ విషయంలో భాస్కర్ ని బాగా ఇబ్బంది పెట్టమని.. కానీ అనుకున్నది సాధించాడు అంటూ బన్నీ కామెంట్స్ చేశారు. పరోక్షంగా రీషూట్ల గురించే చెప్పారు బన్నీ. ఇప్పుడు భాస్కర్ పై నమ్మకంతో గీతాఆర్ట్స్ సంస్థ మరో సినిమా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యంగ్ హీరోకి సెట్ అయ్యే కథని రెడీ చేసుకోమని చెప్పిందట గీతాఆర్ట్స్ సంస్థ. మొత్తానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ తో భాస్కర్ మరో ఛాన్స్ కొట్టేశాడనే చెప్పాలి. మరి ఈసారి ఎలాంటి కథను రెడీ చేసుకుంటారో చూడాలి!
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…