Movie News

ఒక్క క్లైమాక్స్‌కే 50 కోట్లా?

‘బాహుబలి’తో ఇండియాలో మరే హీరోకూ సాధ్యం కాని స్థాయిని అందుకున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ ఇమేజ్ రావడంతో అతను వరుసగా తన రేంజికి తగ్గ సినిమాలే చేస్తున్నాడు. ఇకపై అతను చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేసేలా కనిపించడం లేదు.

ప్రభాస్ సినిమా అంటే ప్రేక్షకులు ఒక భారీతనం ఆశిస్తుండటంతో ఓ మోస్తరు బడ్జెట్లో చేయాలనుకుని మొదలుపెట్టిన సినిమాలు కూడా తర్వాత పెద్ద రేంజికి వెళ్లిపోతున్నాయి. ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’ మీడియం బడ్జెట్లో చేయాలనుకున్నదే. కానీ తర్వాత దాని బడ్జెట్ అమాంతం పెరిగిపోయి 300 కోట్లను దాటిపోయింది. దీని తర్వాత ప్రభాస్ మొదలుపెట్టిన ‘రాధేశ్యామ్’ కూడా అంతే.

దీన్ని మామూలు ప్రేమకథలా తీయాలనుకున్నారు. యాక్షన్ అవసరం లేని సినిమా కావడంతో బడ్జెట్ మరీ ఎక్కువేమీ కాదనుకున్నారు. కానీ భారీ సెట్టింగ్స్ వేయడం.. ఒక నగరాన్నే సెట్టింగ్స్ ద్వారా పున:సృష్టించే ప్రయత్నం చేయడం.. విదేశాల్లో వేర్వేరు లొకేషన్లలో షూటింగ్ చేయడం బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ఈ ప్రేమకథా చిత్రానికి కూడా రూ.250 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో కేవలం క్లైమాక్స్ కోసం రూ.50 కోట్లు వెచ్చించారట. దాదాపు 15 నిమిషాలు సాగే క్లైమాక్స్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లేలా ఉంటుందని.. ఆ భారీతనం, విజువల్స్ చూసి ప్రేక్షకులు మైమరిచిపోతారని అంటున్నాయి చిత్ర వర్గాలు. చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘రాధేశ్యామ్’ను జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేర్వేరు కాలాల్లో సాగే ఈ ప్రేమక చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి ‘సాహో’ లాగా కాకుండా ఈ సినిమా అయినా అంచనాలను అందుకుని ప్రభాస్‌కు మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.

This post was last modified on October 20, 2021 4:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

1 hour ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

1 hour ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

5 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

6 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

7 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

7 hours ago