మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి పది రోజులు కావస్తోంది. కానీ ఆ ఎన్నికల తాలూకు మంటలు మాత్రం ఇంకా చల్లారడం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ పట్ల ముందు నుంచి తనకున్న వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఎన్నికలకు ముందు మంచు విష్ణుకు తన మద్దతు ప్రకటించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.
ఈ క్రమంలో తాను ఎన్నికల్లో ఎవరికి ఓటేసింది కూడా ఆయన వెల్లడించారు. మంచు విష్ణుకు మద్దతిచ్చినంత మాత్రాన ఆయన ప్యానెల్లో అందరికీ తాను ఓటు వేయలేదని ఆయన చెప్పారు. ఓవైపు అధ్యక్షుడిగా విష్ణుకు ఓటు వేసిన తాను.. ఉపాధ్యక్షుడిగా మాత్రం శ్రీకాంత్కు ఓటు వేసినట్లు కోట తెలిపారు. ఐతే ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. శ్రీకాంత్తో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్కు చెందిన అందరూ మంచు విష్ణు బృందంతో కలిసి పని చేయాల్సిందని కోట అభిప్రాయపడ్డారు.
ఇంతకుముందు అలా జరిగింది, నరేష్తో ఇబ్బందైంది.. కలిసి పని చేయలేకపోయా అని సాకులు చెప్పి ఇప్పుడు తమ పదవులకు రాజీనామా చేయడం అర్థ రహితమని కోట అన్నారు. తనతో పాటు శ్రీకాంత్ను నమ్మి ఓటేసిన వాళ్లకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడని ఆయన ప్రశ్నించారు. శ్రీకాంత్ స్థానంలోకి ఊరూ పేరూ లేని వాళ్లను తెచ్చి పెడితే సభ్యుల పరిస్థితి ఏంటని ఆయనన్నారు.
ఇక ఎన్నికల సందర్భంగా టీవీల ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మద్దతుదారైన నాగబాబు, మంచు విష్ణు సపోర్టర్ అయిన నరేష్లను ఆయన తప్పుబట్టారు. ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి నాగబాబు ముఖ్య కారణం అని, ఆయన అవసరం లేని విషయాలన్నీ మాట్లాడారని కోట అన్నారు. నరేష్ సైతం ఊరికే మీడియా ముందుకొచ్చి నానా చెత్త మాట్లాడారని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో కులం కీలక పాత్ర పోషించిందని.. తనకు ఇండస్ట్రీలో ఫుడ్ పెట్టింది 95 శాతం కమ్మలే అని, వాళ్లకు తాను ఎన్నికల్లో మద్దతుగా నిలవాలనుకున్నానని కోట వ్యాఖ్యానించడం గమనార్హం.
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…