మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి పది రోజులు కావస్తోంది. కానీ ఆ ఎన్నికల తాలూకు మంటలు మాత్రం ఇంకా చల్లారడం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ పట్ల ముందు నుంచి తనకున్న వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఎన్నికలకు ముందు మంచు విష్ణుకు తన మద్దతు ప్రకటించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.
ఈ క్రమంలో తాను ఎన్నికల్లో ఎవరికి ఓటేసింది కూడా ఆయన వెల్లడించారు. మంచు విష్ణుకు మద్దతిచ్చినంత మాత్రాన ఆయన ప్యానెల్లో అందరికీ తాను ఓటు వేయలేదని ఆయన చెప్పారు. ఓవైపు అధ్యక్షుడిగా విష్ణుకు ఓటు వేసిన తాను.. ఉపాధ్యక్షుడిగా మాత్రం శ్రీకాంత్కు ఓటు వేసినట్లు కోట తెలిపారు. ఐతే ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. శ్రీకాంత్తో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్కు చెందిన అందరూ మంచు విష్ణు బృందంతో కలిసి పని చేయాల్సిందని కోట అభిప్రాయపడ్డారు.
ఇంతకుముందు అలా జరిగింది, నరేష్తో ఇబ్బందైంది.. కలిసి పని చేయలేకపోయా అని సాకులు చెప్పి ఇప్పుడు తమ పదవులకు రాజీనామా చేయడం అర్థ రహితమని కోట అన్నారు. తనతో పాటు శ్రీకాంత్ను నమ్మి ఓటేసిన వాళ్లకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడని ఆయన ప్రశ్నించారు. శ్రీకాంత్ స్థానంలోకి ఊరూ పేరూ లేని వాళ్లను తెచ్చి పెడితే సభ్యుల పరిస్థితి ఏంటని ఆయనన్నారు.
ఇక ఎన్నికల సందర్భంగా టీవీల ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మద్దతుదారైన నాగబాబు, మంచు విష్ణు సపోర్టర్ అయిన నరేష్లను ఆయన తప్పుబట్టారు. ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి నాగబాబు ముఖ్య కారణం అని, ఆయన అవసరం లేని విషయాలన్నీ మాట్లాడారని కోట అన్నారు. నరేష్ సైతం ఊరికే మీడియా ముందుకొచ్చి నానా చెత్త మాట్లాడారని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో కులం కీలక పాత్ర పోషించిందని.. తనకు ఇండస్ట్రీలో ఫుడ్ పెట్టింది 95 శాతం కమ్మలే అని, వాళ్లకు తాను ఎన్నికల్లో మద్దతుగా నిలవాలనుకున్నానని కోట వ్యాఖ్యానించడం గమనార్హం.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…