మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి పది రోజులు కావస్తోంది. కానీ ఆ ఎన్నికల తాలూకు మంటలు మాత్రం ఇంకా చల్లారడం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ పట్ల ముందు నుంచి తనకున్న వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఎన్నికలకు ముందు మంచు విష్ణుకు తన మద్దతు ప్రకటించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.
ఈ క్రమంలో తాను ఎన్నికల్లో ఎవరికి ఓటేసింది కూడా ఆయన వెల్లడించారు. మంచు విష్ణుకు మద్దతిచ్చినంత మాత్రాన ఆయన ప్యానెల్లో అందరికీ తాను ఓటు వేయలేదని ఆయన చెప్పారు. ఓవైపు అధ్యక్షుడిగా విష్ణుకు ఓటు వేసిన తాను.. ఉపాధ్యక్షుడిగా మాత్రం శ్రీకాంత్కు ఓటు వేసినట్లు కోట తెలిపారు. ఐతే ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. శ్రీకాంత్తో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్కు చెందిన అందరూ మంచు విష్ణు బృందంతో కలిసి పని చేయాల్సిందని కోట అభిప్రాయపడ్డారు.
ఇంతకుముందు అలా జరిగింది, నరేష్తో ఇబ్బందైంది.. కలిసి పని చేయలేకపోయా అని సాకులు చెప్పి ఇప్పుడు తమ పదవులకు రాజీనామా చేయడం అర్థ రహితమని కోట అన్నారు. తనతో పాటు శ్రీకాంత్ను నమ్మి ఓటేసిన వాళ్లకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడని ఆయన ప్రశ్నించారు. శ్రీకాంత్ స్థానంలోకి ఊరూ పేరూ లేని వాళ్లను తెచ్చి పెడితే సభ్యుల పరిస్థితి ఏంటని ఆయనన్నారు.
ఇక ఎన్నికల సందర్భంగా టీవీల ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మద్దతుదారైన నాగబాబు, మంచు విష్ణు సపోర్టర్ అయిన నరేష్లను ఆయన తప్పుబట్టారు. ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి నాగబాబు ముఖ్య కారణం అని, ఆయన అవసరం లేని విషయాలన్నీ మాట్లాడారని కోట అన్నారు. నరేష్ సైతం ఊరికే మీడియా ముందుకొచ్చి నానా చెత్త మాట్లాడారని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో కులం కీలక పాత్ర పోషించిందని.. తనకు ఇండస్ట్రీలో ఫుడ్ పెట్టింది 95 శాతం కమ్మలే అని, వాళ్లకు తాను ఎన్నికల్లో మద్దతుగా నిలవాలనుకున్నానని కోట వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on October 20, 2021 4:11 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…