మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి పది రోజులు కావస్తోంది. కానీ ఆ ఎన్నికల తాలూకు మంటలు మాత్రం ఇంకా చల్లారడం లేదు. విమర్శలు, ప్రతి విమర్శలు, వాదోపవాదాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ పట్ల ముందు నుంచి తనకున్న వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఎన్నికలకు ముందు మంచు విష్ణుకు తన మద్దతు ప్రకటించిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు.
ఈ క్రమంలో తాను ఎన్నికల్లో ఎవరికి ఓటేసింది కూడా ఆయన వెల్లడించారు. మంచు విష్ణుకు మద్దతిచ్చినంత మాత్రాన ఆయన ప్యానెల్లో అందరికీ తాను ఓటు వేయలేదని ఆయన చెప్పారు. ఓవైపు అధ్యక్షుడిగా విష్ణుకు ఓటు వేసిన తాను.. ఉపాధ్యక్షుడిగా మాత్రం శ్రీకాంత్కు ఓటు వేసినట్లు కోట తెలిపారు. ఐతే ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చినప్పటికీ.. శ్రీకాంత్తో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్కు చెందిన అందరూ మంచు విష్ణు బృందంతో కలిసి పని చేయాల్సిందని కోట అభిప్రాయపడ్డారు.
ఇంతకుముందు అలా జరిగింది, నరేష్తో ఇబ్బందైంది.. కలిసి పని చేయలేకపోయా అని సాకులు చెప్పి ఇప్పుడు తమ పదవులకు రాజీనామా చేయడం అర్థ రహితమని కోట అన్నారు. తనతో పాటు శ్రీకాంత్ను నమ్మి ఓటేసిన వాళ్లకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతాడని ఆయన ప్రశ్నించారు. శ్రీకాంత్ స్థానంలోకి ఊరూ పేరూ లేని వాళ్లను తెచ్చి పెడితే సభ్యుల పరిస్థితి ఏంటని ఆయనన్నారు.
ఇక ఎన్నికల సందర్భంగా టీవీల ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ మద్దతుదారైన నాగబాబు, మంచు విష్ణు సపోర్టర్ అయిన నరేష్లను ఆయన తప్పుబట్టారు. ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి నాగబాబు ముఖ్య కారణం అని, ఆయన అవసరం లేని విషయాలన్నీ మాట్లాడారని కోట అన్నారు. నరేష్ సైతం ఊరికే మీడియా ముందుకొచ్చి నానా చెత్త మాట్లాడారని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో కులం కీలక పాత్ర పోషించిందని.. తనకు ఇండస్ట్రీలో ఫుడ్ పెట్టింది 95 శాతం కమ్మలే అని, వాళ్లకు తాను ఎన్నికల్లో మద్దతుగా నిలవాలనుకున్నానని కోట వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on October 20, 2021 4:11 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…