పూజా హెగ్డేను ప్రస్తుతం టాలీవుడ్ అనే కాదు.. సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ఇండియా మొత్తంలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి బడా స్టార్ల సరసన నటించి ఆమె.. త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తోనూ జత కట్టబోతోంది.
అలాగే తమిళంలో విజయ్ లాంటి టాప్ స్టార్తో నటిస్తోంది. మరోవైపు హిందీలోనూ సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. హిట్ల మీద హిట్లు కొడుతూ.. మంచి మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్న పూజా.. తాజాగా తన ట్విటర్ అభిమానులతో చిట్ చాట్ చేసింది.
ఈ సందర్భంగా ఆమెకు కొన్ని కొంటె ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఒక నెటిజన్ అయితే.. మనిద్దరి రిలేషన్షిప్ గురించి ఈ ప్రపంచానికి ఎప్పుడు చెబుదాం అంటూ పూజాను కవ్వించాడు. దీనికి పూజా ఇచ్చిన రిప్లై ట్విట్టర్లో వైరల్ అయిపోయింది. ఆ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం.. రక్షాభందన్ రోజున అని. అంటే అతనేమో పూజా తన ప్రేయసి అన్నట్లుగా మాట్లాడితే.. ఆమె మాత్రం అతణ్ని సోదరుడిగా భావిస్తున్నట్లుగా పంచ్ ఇచ్చింది.
పూజా ఎంతో కూల్గా ఇచ్చిన ఈ ఆన్సర్ నెటిజన్లకు భలే నచ్చేసింది. ఇక కెరీర్ సంబంధిత ప్రశ్నలు అడిగినపుడు కూడా పూజా ఇంతే కూల్గా ఆన్సర్లు ఇచ్చింది. అమితాబ్ బచ్చన్తో నటించడం తన కల అని, ఏదో ఒక రోజు ఆ కల నెరవేరుతుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన పూజా.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా చూసి చిరంజీవి తనను అభినందిస్తూ మెసేజ్ చేశారని, అది తనకెంతగానో స్ఫూర్తిగా నిలిచిందిని చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. ‘రియల్’ అని బదులిచ్చిన ఆమె.. దళపతి విజయ్ ‘స్వీటెస్ట్’ అని పేర్కొంది.
This post was last modified on October 20, 2021 4:07 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…