రీసెంట్గా వైష్ణవ్ తేజ్తో కలిసి ‘కొండపొలం’ చేసుకోడానికి అడవి బాట పట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు మరోసారి అడవికి వెళ్లబోతోంది. అదీ బాలీవుడ్ సినిమా కోసం. అశుతోష్ గోవారికర్ డైరెక్షన్లో ఫర్హాన్ అఖ్తర్ హీరోగా తెరకెక్కనున్న మూవీలో రకుల్ హీరోయిన్గా నటించనుంది. ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లోనే ఉండబోతోంది.
ఒకప్పుడు సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలిగిన రకుల్, ఆ తర్వాత రేసులో కాస్త వెనుకబడింది. ప్రస్తుతం అక్టోబర్ 31 లేడీస్ నైట్, అయలాన్ తప్ప దక్షిణాదిన వేరే సినిమాలేవీ చేయడం లేదు. కానీ బాలీవుడ్లో మాత్రం బాగానే చక్రం తిప్పుతోంది. అటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జి, ఛత్రీవాలీ అంటూ బోలెడన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో. ఇప్పుడు అశుతోష్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది.
హిస్టారికల్ సినిమాలు తీయడంలో అశుతోష్ ఎక్స్పర్ట్. లగాన్, జోధా అక్బర్, మొహంజొదారో, పానిపట్ లాంటి బ్లాక్ బస్టర్స్ తీశాడు. ఆ జానర్తో విసిగిపోయాడో ఏమో.. రూటు మార్చి సోషల్ సబ్జెక్ట్తో పక్కా కమర్షియల్ మూవీ తీయాలని డిసైడయ్యాడు. ఫర్హాన్ అఖ్తర్ హీరోగా ‘పుకార్’ అనే సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా అడవి నేపథ్యంలో ఉంటుంది. ఫర్హాన్ ఫారెస్ట్ ఆఫీసర్గా కనిపిస్తాడు. అడవిని, అటవీ సంపదను కాపాడటానికి అతను పడే తపనే ఈ సినిమా కాన్సెప్ట్. మరో విశేషమేమిటంటే ఈ మూవీతో జగపతిబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడట. తనని విలన్గా సెలెక్ట్ చేసుకున్నాడట అశుతోష్.
పదిహేనేళ్ల తర్వాత జావెద్ అఖ్తర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే రాయడం మరో విశేషం. డిసెంబర్లో సినిమా సెట్స్కి వెళ్తుంది. ‘ఛత్రీవాలీ’ సినిమాని పూర్తి చేసిన తర్వాత రకుల్ ఈ మూవీ షూట్లో జాయినవుతుంది. మొత్తానికి బీటౌన్లో రకుల్ జర్నీ చాలా ఇంటరెస్టింగ్గా సాగుతోంది.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…