అదేం చిత్రమో కానీ.. టాలీవుడ్లో చాలామంది హీరోలకు తిరుగులేని విజయాలందించి వాళ్ల ఇమేజ్ను మార్చేసి, కెరీర్లను మరో స్థాయికి తీసుకెళ్లిన అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్.. తన కొడుకు పూరి ఆకాశ్కు మాత్రం సరైన విజయాన్నందించలేకపోయాడు. అతడి కెరీర్ను సరిగా ప్లాన్ చేయడంలోనూ పూరి విఫలమయ్యాడనే చెప్పాలి.
ఆకాశ్ టీనేజీలో ఉండగా తొందరపడి ఆంధ్రాపోరి అనే సినిమా చేయించాడు. అది ప్రేక్షకులకు ఏమాత్రం రుచించలేదు. ఆకాశ్ను పూర్తి స్థాయి హీరోగా అయినా సరైన సినిమాతో పరిచయం చేశాడా అంటే అదీ లేదు. తాను పేలవమైన ఫాంలో ఉన్న టైంలో మెహబూబా అనే లవ్ స్టోరీ చేశాడు కొడుకుతో. అది డిజాస్టర్ అయింది. ఇక ఆకాశ్ తర్వాతి సినిమాకైనా జాగ్రత్త పడ్డాడా అంటే అలాంటి సంకేతాలేమీ కనిఇపంచడం లేదు.
ఆకాశ్ కొత్త చిత్రం రొమాంటిక్ ట్రైలర్ మంగళవారమే రిలీజైంది. దాన్ని చూస్తే పూరి తీసిన నేను నా రాక్షసి, రోగ్ లాంటి డిజాస్టర్లు గుర్తుకొస్తున్నాయి జనాలకు. ఈ సినిమాకు పూరి దర్శకుడు కాదు కానీ.. సినిమా మాత్రం ఆయన తీసినట్లే ఉంది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చింది పూరీనే, సినిమా తీసిందేమో పూరి శిష్యుడైన అనిల్ పాడూరి.
మరి అది పూరి సినిమాలా కాకుండా ఇంకెలా ఉంటుంది. అమ్మాయిని కసిగా.. కొరుక్కుతినేయాలన్నట్లు చూసే హీరో.. నీకేం కావాలని అడుగుతూ అతణ్ని తిట్టిపోసే హీరోయిన్.. ఒక దశ దాటాక ఇద్దరి మధ్య ఘాటు రొమాన్స్.. ఇలా పూరి తీసిన చాలా సినిమాల టెంప్టేట్ స్టయిలే ఇందులోనూ కనిపిస్తోంది.
మామూలుగా ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమ అనుకుని అట్రాక్షన్లో ఉంటారని.. కానీ వీళ్లు నిజమైన ప్రేమను అట్రాక్షన్ అనుకుంటున్నారు.. ఈ డైలాగ్ను బట్టి ఇదేదో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిం అని ప్రొజెక్ట్ చేయాలని చూశారు కానీ.. ట్రీట్మెంట్ మాత్రం చాలా రొటీన్గా, ఓల్డ్ స్టయిల్లో ఉంది. పూరి తీసిన ఈ టైపు లవ్ స్టోరీలు ఎప్పుడో మొహం మొత్తేశాయి. అందుకే ఆయన కూడా అవి వదిలేసి ఇస్మార్ట్ శంకర్, లైగర్ అంటూ యాక్షన్ సినిమాలు చేసుకుంటున్నాడు. మరి ఇలాంటి సినిమాతో కొడుక్కి పూరి ఏం లైఫ్ ఇస్తాడన్నది డౌట్గానే ఉంది. చూద్దాం అక్టోబరు 29న ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో?
This post was last modified on October 20, 2021 8:01 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…