తమ ఫేవరేట్ హీరోని ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్లో చూడటం ఫ్యాన్స్కి భలే కిక్కిస్తుంది. అందుకే డ్యూయెల్ రోల్ చేయడానికి హీరోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బాలకృష్ణ అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో రెండు రకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’లోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నారు. విశేషమేమిటంటే.. నెక్స్ట్ మూవీలోనూ ఆయన ఇద్దరిగానే కనిపిస్తారట.
‘క్రాక్’తో భారీ హిట్టు కొట్టిన గోపీచంద్ మలినేని చేతిలో తన నెక్స్ట్ మూవీని పెట్టారు బాలయ్య. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలయ్య కోసం ఓ ఖతర్నాక్ స్టోరీని రెడీ చేశానని ఆల్రెడీ గోపీచంద్ చెప్పాడు. ఆయన కోసం రెండు వేరియేషన్స్ రెడీ చేశాడట. ఒక రోల్లో ఫ్యాక్షనిస్ట్గా, మరో పాత్రలో ఆధ్యాత్మిక గురువుగా బాలయ్య కనిపిస్తారని సమాచారం.
అయితే ప్రస్తుతం చేస్తున్న ‘అఖండ’లో ఒక పాత్ర అఘోరా. మళ్లీ వెంటనే స్వామీజీగానో ఆధ్మాత్మిక గురువుగానో నటిస్తే ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఉంటుందా, యాక్సెప్ట్ చేస్తారా అనేది డౌట్. అయితే గోపీచంద్ ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఫుల్ క్లారిటీ రాలేదు. త్రిష హీరోయిన్గా నటించనుందని, కర్ణాటక బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
This post was last modified on October 19, 2021 12:04 pm
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…