తమ ఫేవరేట్ హీరోని ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్లో చూడటం ఫ్యాన్స్కి భలే కిక్కిస్తుంది. అందుకే డ్యూయెల్ రోల్ చేయడానికి హీరోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బాలకృష్ణ అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో రెండు రకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’లోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నారు. విశేషమేమిటంటే.. నెక్స్ట్ మూవీలోనూ ఆయన ఇద్దరిగానే కనిపిస్తారట.
‘క్రాక్’తో భారీ హిట్టు కొట్టిన గోపీచంద్ మలినేని చేతిలో తన నెక్స్ట్ మూవీని పెట్టారు బాలయ్య. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలయ్య కోసం ఓ ఖతర్నాక్ స్టోరీని రెడీ చేశానని ఆల్రెడీ గోపీచంద్ చెప్పాడు. ఆయన కోసం రెండు వేరియేషన్స్ రెడీ చేశాడట. ఒక రోల్లో ఫ్యాక్షనిస్ట్గా, మరో పాత్రలో ఆధ్యాత్మిక గురువుగా బాలయ్య కనిపిస్తారని సమాచారం.
అయితే ప్రస్తుతం చేస్తున్న ‘అఖండ’లో ఒక పాత్ర అఘోరా. మళ్లీ వెంటనే స్వామీజీగానో ఆధ్మాత్మిక గురువుగానో నటిస్తే ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఉంటుందా, యాక్సెప్ట్ చేస్తారా అనేది డౌట్. అయితే గోపీచంద్ ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఫుల్ క్లారిటీ రాలేదు. త్రిష హీరోయిన్గా నటించనుందని, కర్ణాటక బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
This post was last modified on October 19, 2021 12:04 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…