తమ ఫేవరేట్ హీరోని ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్లో చూడటం ఫ్యాన్స్కి భలే కిక్కిస్తుంది. అందుకే డ్యూయెల్ రోల్ చేయడానికి హీరోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బాలకృష్ణ అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో రెండు రకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’లోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నారు. విశేషమేమిటంటే.. నెక్స్ట్ మూవీలోనూ ఆయన ఇద్దరిగానే కనిపిస్తారట.
‘క్రాక్’తో భారీ హిట్టు కొట్టిన గోపీచంద్ మలినేని చేతిలో తన నెక్స్ట్ మూవీని పెట్టారు బాలయ్య. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలయ్య కోసం ఓ ఖతర్నాక్ స్టోరీని రెడీ చేశానని ఆల్రెడీ గోపీచంద్ చెప్పాడు. ఆయన కోసం రెండు వేరియేషన్స్ రెడీ చేశాడట. ఒక రోల్లో ఫ్యాక్షనిస్ట్గా, మరో పాత్రలో ఆధ్యాత్మిక గురువుగా బాలయ్య కనిపిస్తారని సమాచారం.
అయితే ప్రస్తుతం చేస్తున్న ‘అఖండ’లో ఒక పాత్ర అఘోరా. మళ్లీ వెంటనే స్వామీజీగానో ఆధ్మాత్మిక గురువుగానో నటిస్తే ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఉంటుందా, యాక్సెప్ట్ చేస్తారా అనేది డౌట్. అయితే గోపీచంద్ ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఫుల్ క్లారిటీ రాలేదు. త్రిష హీరోయిన్గా నటించనుందని, కర్ణాటక బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
This post was last modified on October 19, 2021 12:04 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…