తమ ఫేవరేట్ హీరోని ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్లో చూడటం ఫ్యాన్స్కి భలే కిక్కిస్తుంది. అందుకే డ్యూయెల్ రోల్ చేయడానికి హీరోలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. బాలకృష్ణ అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో రెండు రకాల పాత్రల్లో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న ‘అఖండ’లోనూ ద్విపాత్రాభినయమే చేస్తున్నారు. విశేషమేమిటంటే.. నెక్స్ట్ మూవీలోనూ ఆయన ఇద్దరిగానే కనిపిస్తారట.
‘క్రాక్’తో భారీ హిట్టు కొట్టిన గోపీచంద్ మలినేని చేతిలో తన నెక్స్ట్ మూవీని పెట్టారు బాలయ్య. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలయ్య కోసం ఓ ఖతర్నాక్ స్టోరీని రెడీ చేశానని ఆల్రెడీ గోపీచంద్ చెప్పాడు. ఆయన కోసం రెండు వేరియేషన్స్ రెడీ చేశాడట. ఒక రోల్లో ఫ్యాక్షనిస్ట్గా, మరో పాత్రలో ఆధ్యాత్మిక గురువుగా బాలయ్య కనిపిస్తారని సమాచారం.
అయితే ప్రస్తుతం చేస్తున్న ‘అఖండ’లో ఒక పాత్ర అఘోరా. మళ్లీ వెంటనే స్వామీజీగానో ఆధ్మాత్మిక గురువుగానో నటిస్తే ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఉంటుందా, యాక్సెప్ట్ చేస్తారా అనేది డౌట్. అయితే గోపీచంద్ ఇంకా ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఫుల్ క్లారిటీ రాలేదు. త్రిష హీరోయిన్గా నటించనుందని, కర్ణాటక బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.
This post was last modified on October 19, 2021 12:04 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…