కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన సినిమా మన తెలుగుదే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరికి ఎంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయో తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ భారీ చిత్రం స్థాయిలో జరగడంతో డివైడ్ టాక్ను తట్టుకుని కూడా తొలి వారాంతంలో పాతిక కోట్ల దాకా షేర్ రాబట్టిందీ చిత్రం. వీకెండ్ తర్వాత కొంచెం నెమ్మదించినా కూడా ఓవరాల్గా రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది లవ్ స్టోరి.
తొలి రోజు, తొలి వారాంతం, అలాగే ఫుల్ రన్ వసూళ్లలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది లవ్ స్టోరి. ఏ భాషలో అయినా ఏదైనా భారీ చిత్రం వస్తే తప్ప లవ్ స్టోరి రికార్డులు బద్దలు కావనుకున్నారంతా. కానీ తమిళంలో శివ కార్తికేయన్ సినిమా డాక్టర్.. అంచనాల్ని మించి విజయం సాధించి లవ్ స్టోరి రికార్డులన్నింటినీ అధిగమించేసింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ముందు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు కానీ.. మంచి రివ్యూలు రావడం, థియేటర్లలో ఉన్న మిగతా తెలుగు చిత్రాల కంటే మెరుగైన సినిమా అనే టాక్ ఉండటంతో మన వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు. తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లకు మంచి లాభాలే తెచ్చిపెట్టిందీ సినిమా.
ఇక తమిళంలో డాక్టర్ అంచనాల్ని మించి ఆడేసింది. ఓవరాల్గా ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. తమిళంలో గత ఏడాది కరోనా ప్రభావం మొదలయ్యాక సంక్రాంతికి విడుదలైన మాస్టర్ కాకుండా మరే చిత్రం ఈ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు. రెండో వారంలోనూ మంచి వసూళ్లతో ఈ సినిమా దూసుకెళ్తోంది. దసరా సెలవులను బాగానే క్యాష్ చేసుకుంటోంది.
ఈ చిత్ర దర్శకుడు నెల్సన్కు ఇది రెండో సినిమా మాత్రమే. తొలి చిత్రం కోలమావు కోకిల (తెలుగులో కొకో కోకిల) సూపర్ హిట్ కాగా.. డాక్టర్ చేస్తున్న సమయంలోనే విజయ్తో బీస్ట్ లాంటి భారీ చిత్రం చేసే అవకాశం పట్టేశాడతను. డాక్టర్లో గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక మోహన్ కథానాయికగా నటించింది. కిడ్నాపింగ్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్నే అందిస్తోంది.
This post was last modified on October 17, 2021 6:34 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…