కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచిన సినిమా మన తెలుగుదే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరికి ఎంత మంచి ఓపెనింగ్స్ వచ్చాయో తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ భారీ చిత్రం స్థాయిలో జరగడంతో డివైడ్ టాక్ను తట్టుకుని కూడా తొలి వారాంతంలో పాతిక కోట్ల దాకా షేర్ రాబట్టిందీ చిత్రం. వీకెండ్ తర్వాత కొంచెం నెమ్మదించినా కూడా ఓవరాల్గా రూ.35 కోట్ల దాకా షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది లవ్ స్టోరి.
తొలి రోజు, తొలి వారాంతం, అలాగే ఫుల్ రన్ వసూళ్లలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది లవ్ స్టోరి. ఏ భాషలో అయినా ఏదైనా భారీ చిత్రం వస్తే తప్ప లవ్ స్టోరి రికార్డులు బద్దలు కావనుకున్నారంతా. కానీ తమిళంలో శివ కార్తికేయన్ సినిమా డాక్టర్.. అంచనాల్ని మించి విజయం సాధించి లవ్ స్టోరి రికార్డులన్నింటినీ అధిగమించేసింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ముందు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు కానీ.. మంచి రివ్యూలు రావడం, థియేటర్లలో ఉన్న మిగతా తెలుగు చిత్రాల కంటే మెరుగైన సినిమా అనే టాక్ ఉండటంతో మన వాళ్లు కూడా ఈ సినిమాను బాగానే చూశారు. తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లకు మంచి లాభాలే తెచ్చిపెట్టిందీ సినిమా.
ఇక తమిళంలో డాక్టర్ అంచనాల్ని మించి ఆడేసింది. ఓవరాల్గా ఈ చిత్రం రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. తమిళంలో గత ఏడాది కరోనా ప్రభావం మొదలయ్యాక సంక్రాంతికి విడుదలైన మాస్టర్ కాకుండా మరే చిత్రం ఈ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు. రెండో వారంలోనూ మంచి వసూళ్లతో ఈ సినిమా దూసుకెళ్తోంది. దసరా సెలవులను బాగానే క్యాష్ చేసుకుంటోంది.
ఈ చిత్ర దర్శకుడు నెల్సన్కు ఇది రెండో సినిమా మాత్రమే. తొలి చిత్రం కోలమావు కోకిల (తెలుగులో కొకో కోకిల) సూపర్ హిట్ కాగా.. డాక్టర్ చేస్తున్న సమయంలోనే విజయ్తో బీస్ట్ లాంటి భారీ చిత్రం చేసే అవకాశం పట్టేశాడతను. డాక్టర్లో గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక మోహన్ కథానాయికగా నటించింది. కిడ్నాపింగ్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్నే అందిస్తోంది.
This post was last modified on October 17, 2021 6:34 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…