ఈసారి దసరా సీజన్లో మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. మూడింట్లో దేనికీ పూర్తి సానుకూల స్పందన లేదు ఆడియన్స్ నుంచి. ఐతే పెళ్ళి సందడి మరీ పేలవంగా ఉండటంతో చూసిన ప్రేక్షకులు బెంబేలెత్తిపోతున్నారు. మహాసముద్రం అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఈ రెంటితో పోలిస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మెరుగే.
పండుగ టైంలో ఏదో ఒక సినిమా చూడాలి అనుకున్న వాళ్లందరికీ ఇదే ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. ఐతే సినిమా అనుకున్నంత సంతృప్తిని మాత్రం ఇవ్వట్లేదు. ఉన్న సినిమాల్లో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ను కొంతమేర ఎంగేజ్ చేసే సినిమా ఇదే అని చెప్పాలి. తొలి రోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్కు మంచి ఓపెనింగ్సే వచ్చాయి. శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే ప్రభావం చూపేలా కనిపిస్తోంది. బరిలో ఉన్న మిగతా సినిమాలకు మంచి టాక్ వచ్చి ఉంటే మాత్రం తట్టుకుని నిలబడే స్థాయి చిత్రమైతే కాదిది.
బొమ్మరిల్లు భాస్కర్ తన డిజాస్టర్ మూవీ ఆరెంజ్ తరహాలోనే మళ్లీ ప్రేమ.. పెళ్లి.. వైవాహిక జీవితం.. అంటూ డ్రై సబ్జెక్టే తీసుకున్నాడు ఈసారి కూడా. ఐతే దాంతో పోలిస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న మాట వాస్తవమే కానీ.. ఆరెంజ్ లాగా సిన్సియర్గా అయితే ఈ సినిమా తీయలేదు. సిల్లీగా అనిపించే.. లాజిక్ లెస్ సీన్లు బోలెడున్నాయిందులో.
అయినా సినిమా ఈమాత్రం ఆడుతోందంటే అందులో పూజా హెగ్డే పాత్ర కీలకం. టాప్ ఫాంలో ఉన్న పూజ కోసమే యూత్ ఈ సినిమాకు పెద్ద ఎత్తున వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. తన గ్లామర్తో పూజా రిలీజ్ ముంగిటే ఈ సినిమాకు మంచి బజ్ తీసుకురాగలిగింది. ఇక సినిమాలో ఆమె పాత్ర కూడా బాగానే హైలైట్ అయింది. పూజా ఫ్యాన్స్కు అయితే ఈ సినిమా కనువిందే.
అందం, అభినయం రెంటితోనూ పూజా ఆకట్టుకుంది. ఆమె ముందు అఖిల్ ఏ రకంగానూ నిలవలేకపోయాడన్నది వాస్తవం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయి.. అఖిల్ ఖాతాలో తొలి హిట్ పడితే అందులో మేజర్ క్రెడిట్ పూజాదే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ హీరోను సూచించే టైటిల్ పెట్టారు కానీ.. చివరికిది హీరోయిన్ వల్ల ఆడిన సినిమాగానే నిలవబోతోందన్నది స్పష్టం. సక్సెస్ క్రెడిట్ కూడా ఆమెకే చెందుతుంది తప్ప.. అఖిల్కు పెద్దగా మైలేజీ వచ్చే అవకాశాలు లేనట్లే.
This post was last modified on October 16, 2021 10:15 pm
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…