కమెడియన్ సత్య కథానాయికుడి పరిచయం అయిన సినిమా వివాహ భోజనంభు. ఈ చిత్రాన్ని నిర్మించింది యంగ్ హీరో సందీప్ కిషన్ కావడం విశేషం. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్లు నడుపుతున్న సందీప్.. అదే పేరు పెట్టి తన నిర్మాణంలో సినిమా తీశాడు. రామ్ అబ్బరాజు అనే అతడి మిత్రుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. సందీప్ ఇందులో ఒక క్యామియో రోల్ కూడా చేయడం విశేషం.
పరమ పిసినారి అయిన కుర్రాడి ఇంట్లోకి కొవిడ్ టైంలో హీరోయిన్ ఫ్యామిలీ అంతా వచ్చి అక్కడే తిష్ట వేస్తే అతను ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కామెడీ ఓ మోస్తరుగా వర్కవుట్ అయిన ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఓ మోస్తరు స్పందన వచ్చింది.
ఉత్తరాదిన ఫేమస్ అయిన సోనీ లివ్ ఓటీటీ తెలుగులోకి ఈ చిత్రంతోనే అడుగు పెట్టింది. థియేటర్లలో రిలీజై ఉంటే సినిమా హిట్టో ఫట్టో చెప్పగలిగేవాళ్లం. కానీ ఓటీటీ మూవీ కాబట్టి దీనిపై ఒక అంచనాకు రావడం కష్టమే. అయితే చిత్ర బృందం మాత్రం ఇది సూపర్ హిట్టని.. అందుకే తమిళంలోకి కూడా రీమేక్ అవుతోందని అంటోంది. సూర్య కజిన్, ప్రముఖ కోలీవుడ్ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులు తీసుకున్నట్లుగా నిర్మాత సందీప్ కిషన్ వెల్లడించాడు.
అక్కడ సంతానం, యోగిబాబు లాంటి వాళ్లకు ఈ సబ్జెక్ట్ బాగానే సూట్ కావచ్చు. ఈ కథకు ఇంకొంచెం మెరుగులు దిద్దుకుని, కామెడీ బాగా వర్కవుట్ చేస్తే తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించేందుకు అవకాశముంది. మొత్తానికి తక్కువ బడ్జెట్లో సినిమా పూర్తి చేసి మంచి లాభానికే సోనీ లివ్ వాళ్లకు అమ్మేసిన సందీప్ కిషన్.. రీమేక్ హక్కుల ద్వారా కూడా అదనపు ఆదాయం అందుకోవడం విశేషమే.
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…
కొన్నేళ్ల ముందు వరకు తెలుగులో రాశి ఖన్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్…
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…