Movie News

ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ ముచ్చట్లు

ప్రకాష్ రాజ్ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడితే సినిమాలు, రాజకీయాల చర్చే ఉంటుంది. కుటుంబం గురించి ఆయన దాదాపుగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. మొదటి భార్య లతతో విడాకులు తీసుకోవడం, లేటు వయసులో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో పెళ్లి చేసుకోవడం.. తన పిల్లలు, కుటుంబం గురించి ఆయన ఎప్పుడూ మీడియాతో విషయాలు పంచుకున్నది లేదు. ఐతే ఆలీ నిర్వహించే టీవీ షోలో ఆయన కుటుంబం గురించి వివరంగా మాట్లాడారు. తనకు ఒక చెల్లెలని.. ఆమె యుఎస్‌లో స్థిరపడిందని, అలాగే తనకు ఒక తమ్ముడూ ఉన్నాడని.. అతను హైదరాబాద్‌లోనే ఉంటాడని ప్రకాష్ రాజ్ వెల్లడించాడు.

ఇక పిల్లల గురించి ప్రకాష్ రాజ్ చెబుతూ.. “నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి 25 ఏళ్లు. నా ఫాం హౌస్‌లను ఆమే చూసుకుంటుంది. తన కాళ్ల మీద తను నిలబడింది. రెండో అమ్మాయి మేఘన. ఏఆర్‌ రెహమాన్‌ దగ్గర సంగీతం నేర్చకుంటోంది. ఒక అబ్బాయి ఉన్నాడు. నా మొదటి కొడుకు పేరు సిద్దార్థ్‌. ఓ ప్రమాదంలో చనిపోయాడు” అని చెప్పాడు.

తన రెండో పెళ్లి గురించి ప్రకాష్ రాజ్ వివరిస్తూ.. “నా మొదటి భార్య లత నుంచి కొన్ని కారణాల వల్ల విడిపోయాను. ఆ తర్వాత ఒంటరితనం ఏర్పడింది. ఆ సమయంలోనే ఓ సినిమా చేస్తున్నపుడు పోనీ వర్మను మొదటిసారి చూశా. ఆమె ముంబయికి చెందిన కొరియోగ్రాఫర్‌. తర్వాత బాలచందర్ గారి సినిమా చేస్తున్నపుడు అర్జెంటుగా కొరియోగ్రాఫర్ అవసరం పడింది. పక్కనే విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా సెట్‌కు వెళ్తే అక్కడ పోనీ కనిపించింది. మీరు చేస్తారా అంటే సరే అంది. అలా ఆమెతో పరిచయం పెరిగి పెళ్లి వరకు వచ్చింది. నాకు అప్పటికే ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి పూజా మా పెళ్లికి అంగీకరించింది. తర్వాత పోనీ వాళ్లింటికి వెళ్లి కలిశాను. వాళ్లు ముందు ఒప్పుకోలేదు. కానీ పోనీ బలవంతం చేయడంతో సరే అన్నారు. నా మొదటి భార్య లత, పోనీ ఇప్పుడు మంచి స్నేహితులుగా మారారు” అని వివరించారు.

This post was last modified on October 16, 2021 5:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

1 hour ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

6 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago