ప్రకాష్ రాజ్ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడితే సినిమాలు, రాజకీయాల చర్చే ఉంటుంది. కుటుంబం గురించి ఆయన దాదాపుగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. మొదటి భార్య లతతో విడాకులు తీసుకోవడం, లేటు వయసులో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో పెళ్లి చేసుకోవడం.. తన పిల్లలు, కుటుంబం గురించి ఆయన ఎప్పుడూ మీడియాతో విషయాలు పంచుకున్నది లేదు. ఐతే ఆలీ నిర్వహించే టీవీ షోలో ఆయన కుటుంబం గురించి వివరంగా మాట్లాడారు. తనకు ఒక చెల్లెలని.. ఆమె యుఎస్లో స్థిరపడిందని, అలాగే తనకు ఒక తమ్ముడూ ఉన్నాడని.. అతను హైదరాబాద్లోనే ఉంటాడని ప్రకాష్ రాజ్ వెల్లడించాడు.
ఇక పిల్లల గురించి ప్రకాష్ రాజ్ చెబుతూ.. “నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి 25 ఏళ్లు. నా ఫాం హౌస్లను ఆమే చూసుకుంటుంది. తన కాళ్ల మీద తను నిలబడింది. రెండో అమ్మాయి మేఘన. ఏఆర్ రెహమాన్ దగ్గర సంగీతం నేర్చకుంటోంది. ఒక అబ్బాయి ఉన్నాడు. నా మొదటి కొడుకు పేరు సిద్దార్థ్. ఓ ప్రమాదంలో చనిపోయాడు” అని చెప్పాడు.
తన రెండో పెళ్లి గురించి ప్రకాష్ రాజ్ వివరిస్తూ.. “నా మొదటి భార్య లత నుంచి కొన్ని కారణాల వల్ల విడిపోయాను. ఆ తర్వాత ఒంటరితనం ఏర్పడింది. ఆ సమయంలోనే ఓ సినిమా చేస్తున్నపుడు పోనీ వర్మను మొదటిసారి చూశా. ఆమె ముంబయికి చెందిన కొరియోగ్రాఫర్. తర్వాత బాలచందర్ గారి సినిమా చేస్తున్నపుడు అర్జెంటుగా కొరియోగ్రాఫర్ అవసరం పడింది. పక్కనే విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా సెట్కు వెళ్తే అక్కడ పోనీ కనిపించింది. మీరు చేస్తారా అంటే సరే అంది. అలా ఆమెతో పరిచయం పెరిగి పెళ్లి వరకు వచ్చింది. నాకు అప్పటికే ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి పూజా మా పెళ్లికి అంగీకరించింది. తర్వాత పోనీ వాళ్లింటికి వెళ్లి కలిశాను. వాళ్లు ముందు ఒప్పుకోలేదు. కానీ పోనీ బలవంతం చేయడంతో సరే అన్నారు. నా మొదటి భార్య లత, పోనీ ఇప్పుడు మంచి స్నేహితులుగా మారారు” అని వివరించారు.
This post was last modified on October 16, 2021 5:29 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…