‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో అజయ్ భూపతి రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అనామకుడైన హీరో.. కొత్త హీరోయిన్ని పెట్టి తీసిన ఆ చిత్రం పది కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది. వివిధ భాషల్లో ఆ చిత్రం రీమేక్ కూడా అవుతోంది. ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ను ఉపయోగించుకుని హీరో హీరోయిన్లు కార్తికేయ, పాయల్ రాజ్పుత్ బాగానే అవకాశాలు సంపాదించారు. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ సైతం బిజీ అయ్యాడు.
ఐతే దర్శకుడు అజయ్ భూపతికి కూడా మంచి అవకాశాలే వచ్చినా అతను తొందరపడలేదు. ‘మహాసముద్రం’ కథకు ఫిక్స్ అయి.. కొంచెం ఆలస్యమైనా సరే ఈ కథనే, తాను కోరుకున్న నటీనటులతోనే తెరకెక్కించాడు. ఈ గురువారం దసరా కానుకగా ఈ చిత్రం విడుదలైంది. కానీ మంచి అంచనాల మధ్య విడుదలైన సినిమా.. ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది.
బడ్జెట్ సహా సరైన వనరులేమీ లేనపుడే ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అజయ్. కానీ కోరుకున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, మంచి బడ్జెట్, పూర్తి స్వేచ్ఛ.. ఇలా అన్నీ ఉన్నా ‘మహాసముద్రం’ను సరిగా తీర్చిదిద్దలేకపోయాడు. కథలోనే బలం లేకపోగా.. బోరింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు ప్రతికూలంగా మారింది. ‘ఆర్ఎక్స్ 100’లో మాదిరి షాకులు.. సర్ప్రైజులు కూడా ఏమీ లేవీ చిత్రంలో. అజయ్ ఆహా ఓహా అని చెప్పుకున్నది ఇలాంటి సినిమా గురించా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
దర్శకుల విషయంలో ద్వితీయ విఘ్నం ఎప్పట్నుంచో ఉన్న సెంటిమెంటే. తొలి సినిమాతో అదరగొట్టిన చాలామంది దర్శకులు రెండో చిత్రంతో బోల్తా కొట్టిన వాళ్లే. సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడు సహా చాలామందే ఈ జాబితాలో కనిపిస్తారు. ఇప్పుడు అజయ్ సైతం ఆ విఘ్నాన్ని దాటలేకపోయాడు. వీకెండ్లోనే సరిగా పెర్ఫామ్ చేయలేకపోతున్న ‘మహాసముద్రం’ సోమవారం నుంచి నిలవడం చాలా కష్టమే.
This post was last modified on October 16, 2021 3:37 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…