Movie News

చిరంజీవిపై మోహన్ బాబు కౌంటర్లు

మెగాస్టార్ చిరంజీవి మీద మోహన్ బాబు మరోసారి పరోక్షంగా కౌంటర్లు వేశారు. శనివారం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆయన మాట్లాడుతూ.. ‘పెళ్ళిసంద-డి’ వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీద పరోక్షంగా పంచులు వేశారు.

కొందరు రెండేళ్ల పదవి.. చిన్న పదవి అంటూ ‘మా’ అధ్యక్ష పదవిని తక్కువ చేసేలా మాట్లాడుతున్నారని.. కానీ రెండేళ్ల పదవే అయినా ఎంతో బాధ్యతతో చేసే పని ఇదని.. ఆ కుర్చీకి, అందులో కూర్చున్న వ్యక్తికి అందరూ గౌరవం ఇవ్వాలని మోహన్ బాబు వ్యాఖ్యానించారు. ‘మా’ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలోనే జరిగిన ‘పెళ్ళి సంద-డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. రెండేళ్ల పదవి, చిన్న పదవికి ఇన్ని గొడవలెందుకని, అందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.

మోహన్ బాబుకు ఆ వ్యాఖ్యలు రుచించినట్లు లేదు. అందుకే పరోక్షంగా చిరంజీవి మీద కౌంటర్లు వేసినట్లు భావిస్తున్నారు. ఓ టీవీ కార్యక్రమంలో కొన్ని రోజుల ముందు మోహన్ బాబు మాట్లాడుతూ.. చిరంజీవి పేరెత్తకుండా ఆయన తన కొడుకును పోటీ నుంచి తప్పుకోవాలని అనడం ద్వారా తనను బాధ పెట్టినట్లు చెప్పారు. ఇదేం స్నేహం అంటూ పరోక్షంగా చిరంజీవి మీద తన అసహనాన్ని చూపించారు. ఇప్పుడు మరోసారి చిరంజీవి పేరెత్తకుండా ఆయన్ని టార్గెట్ చేశారు.

చిరంజీవి, మోహన్ బాబుల మధ్య ఒకప్పటి వైరం తెలిసిందే. తెలుగు సినిమా వజ్రోత్సవాల సమయంలో వారి మధ్య తలెత్తిన గొడవ.. ఇద్దరి మధ్య పెద్ద అగాథాన్నే సృష్టించింది. కొన్నేళ్ల పాటు ఇద్దరూ కలవలేకపోయారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి దగ్గరయ్యారు. ముఖ్యంగా ఈ విషయంలో చిరంజీవి చొరవ చూపడంతో పాత మిత్రులు కలిసిపోయారు. గత కొన్నేళ్లలో ఇద్దరూ ఎంతో సన్నిహితంగా కనిపిస్తుండటం తెలిసిందే. రెండేళ్ల కిందట ‘మా’కు సంబంధించిన ఓ కార్యక్రమంలో వీళ్లిద్దరి అనుబంధం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే ఈ మిత్రుల మధ్య ‘మా’ ఎన్నికలు చిచ్చు రేపినట్లే కనిపిస్తోంది. మరోసారి చిరు చొరవ తీసుకుంటే తప్ప రీయూనియన్ సాధ్యమయ్యేలా లేదు.

This post was last modified on October 16, 2021 5:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

4 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

41 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago