టాలీవుడ్లో పెద్దగా హడావుడి లేకుండా చకచకా సినిమాలు చేసుకుపోయే హీరోల్లో నాని ఒకడు. కరోనా వల్ల కొంచెం స్పీడు తగ్గింది కానీ.. మామూలుగా అతను ఏడాదికి మూడు సినిమాలు లాగించేస్తుంటాడు. అలా అని రొటీన్ సినిమాలతో సర్దుకపోయే రకం కూడా కాదు నాని. చాలా వరకు వైవిధ్యమైన కథలే ఎంచుకుంటుంటాడు.
ఈ మధ్య వి, టక్ జగదీష్ లాంటి రొటీన్ టచ్ ఉన్న చిత్రాలతో నిరాశ పరిచిన నాని.. వీటి తర్వాత శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి లాంటి వైవిధ్యమైన సినమాలతో పలకరించబోతున్నాడు. ఇప్పుడు నాని చేయబోయే మరో కొత్త సినిమాకు రంగం సిద్ధమైంది.
దసరా సందర్భంగా ఈ నెల 15న ఈ సినిమాను అనౌన్స్ చేయబోతున్నారు. ముందుగా ప్రి లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అది చూస్తే మొత్తం నలుపు రంగుతో నిండిపోయి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలను తలపించింది.
ఈ సినిమా నేపథ్యాన్ని సూచించేలాగే ఈ పోస్టర్ను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇది సింగరేణి గనుల నేపథ్యంలో సాగే సినిమా అని.. నాని సరికొత్త అవతారంతో షాక్ ఇవ్వబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి దసరా అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ నెల 15న రిలీజ్ కానున్న ఫస్ట్ లుక్ స్టన్నింగ్గా ఉంటుందట.
ఈ చిత్రంతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు టాలీవుడ్కు పరిచయం కానున్నాడు. పడి పడి లేచె మనసు, విరాటపర్వం చిత్రాలతో పాటు రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి నాని 29వ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్నందించనున్నాడట.
తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న సంతోష్.. వెంకటేష్ చేసిన డబ్బింగ్ సినిమా గురుతో తెలుగులోకి అడుగు పెట్టాడు. కబాలి సహా కొన్ని తమిళ అనువాద చిత్రాలతోనూ మన ప్రేక్షకులను పలకరించాడు. కానీ అతను చేస్తున్న ఒరిజినల్ తెలుగు సినిమా అంటే ఇదే అని చెప్పాలి.
This post was last modified on October 14, 2021 4:53 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…