Movie News

కార్తికేయ.. కత్తిలాంటి విలన్‌

పాజిటివ్ పాత్రలు చేయడం కంటే, నెగిటివ్ రోల్స్‌ని పండించడం చాలా కష్టం. అయితే అలాంటి క్యారెక్టర్ట్ చేసినప్పుడే ఓ నటుడి టాలెంట్ బయట పడుతుంది. అందుకే మన యంగ్ హీరోస్‌లో చాలామంది నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా ఓకే అంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో విలన్లుగా కనిపించి మెప్పిస్తున్నారు. కార్తికేయ కూడా అదే దారిలో సాగుతున్నాడు.

‘ఆర్‌‌ఎక్స్‌ 100’లో భగ్న ప్రేమికుడిగా కంటతడి పెట్టించిన కార్తికేయకి, ఆ తర్వాత అంతటి విజయం దక్కలేదు. కానీ ‘గ్యాంగ్‌లీడర్‌‌’లో విలన్ పాత్ర మాత్రం చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. దానివల్లే అజిత్ ‘వలిమై’లో ప్రతినాయక పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. దానికి చాలా సంతోష పడుతున్నాడు కార్తికేయ. రేసర్ గెటప్‌లో అజిత్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, నేనెంతో గర్వంగా చెప్పుకునే మూమెంట్స్‌లో ఇదొకటి అని చెప్పాడు.

అజిత్ సినిమా అంటే ఏ స్థాయిలో తెరకెక్కుతుందో తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎంచుకోవడం, సినిమా సినిమాకీ లుక్ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపించడం అజిత్‌ స్టైల్‌. వలిమై మూవీ విషయంలోనూ అదే కేర్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఓ పవర్‌‌ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. అలాగే ఫుల్‌ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండే ఈ చిత్రంలో బైక్ రేసులు ప్రధాన పాత్ర పోషిస్తాయని టీజర్ చూశాక అర్థమయ్యింది.

ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ శత్రువులుగా మారితే ఏం జరుగుతుందనేది స్టోరీ అట. ఎనిమీస్‌గా మారిన తర్వాత కార్తికేయ, అజిత్‌ల మధ్య వార్ ఓ రేంజ్‌లో ఉంటుందట. సినిమా చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా అజిత్‌తో కార్తికేయ పోటీపడి మరీ నటించాడని, అతని పాత్ర కూడా హీరోతో సమానంగా మెప్పిస్తుందని టీమ్‌ చెబుతోంది. ఇండస్ట్రీకి కత్తిలాంటి విలన్‌ దొరికాడనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే విలన్‌గా కార్తికేయకి మంచి ఫ్యూచరే ఉందనిపిస్తోంది.

This post was last modified on October 14, 2021 6:51 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago