ఏదైనా పండుగ వచ్చిందంటే తమ ఫేవరేట్ స్టార్స్ చేస్తున్న సినిమాల అప్డేట్స్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అందుకు తగ్గట్టే ఈ దసరా సీజన్లో తమ సినిమాల గురించి ఏదో ఒక విశేషాన్ని రివీల్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ‘ఆచార్య’ టీమ్ నుంచి కూడా విజయదశమి నాడు ఓ అదిరిపోయే అప్డేట్ వస్తుందని మెగా ఫ్యాన్స్ చూస్తున్నారు. అయితే అంతకంటే ముందే పూజా హెగ్డే లుక్ని విడుదల చేసి ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేసింది టీమ్.
ఇవాళ పూజా హెగ్డే పుట్టినరోజు కావడంతో ఆమె నటిస్తున్న సినిమాల నుంచి రకరకాల అప్డేట్స్ వచ్చాయి. అలాగే ఆచార్య నుంచి ఓ బ్యూటిఫుల్ పోస్టర్ వచ్చింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్కి జోడీగా కాజల్ నటిస్తుంటే, కీలక పాత్రధారి రామ్చరణ్కి జంటగా పూజా హెగ్డే యాక్ట్ చేస్తోంది. ఆమె పోషిస్తున్న నీలాంబరి పాత్ర ఎలా ఉంటుందో గతంలో ఓ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి అమె అందమైన లుక్తో కనువిందు చేశారు.
లంగావోణీ వేసుకుని, నుదుటన చక్కగా బొట్టు దిద్దుకుని, విరబూసిన కురులతో, చూడముచ్చటైన చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది పూజ. చేతిలో పూజ సామాగ్రి ఉంది. బ్యాక్డ్రాప్లో గుడి కనిపిస్తోంది. మొత్తంగా ఈ పోస్టర్ సినీ ప్రియుల మనసు దోచేయడం ఖాయమనిపిస్తోంది. ఈ పండక్కి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’తో రానున్న పూజ.. సంక్రాంతికి ‘రాధేశ్యామ్’తోను, ఆ తర్వాతి నెల ‘ఆచార్యతోను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్తో చేస్తున్న ‘బీస్ట్’ కూడా పొంగల్నే టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రణ్వీర్ సింగ్తో నటిస్తున్న ‘సర్కస్’ వచ్చే వేసవి లోపే విడుదల కానుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలతో ఫీస్ట్ ఇవ్వబోతోంది పూజ.
This post was last modified on October 13, 2021 5:45 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…