ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేయడం సినిమా ప్రియులకు ఆనందకరమే కానీ నిర్మాతలకు మాత్రం ఇది లాభదాయకం కాదు. కంటెంట్ నిజంగా బ్రహ్మాండంగా వుంటే జనం ఎగబడి చూస్తారు. ఫలానా సినిమా చూడమంటూ పదిమందికి చెప్తారు. అదే సినిమా అంతంతమాత్రంగా ఉన్నట్టయితే ఓటిటీలో ఫ్రీగా చూడ్డానికి కూడా జనం అంతగా ఇష్టపడరు.
తమిళం నుంచి విడుదలైన జ్యోతిక సినిమా పోన్మగల్ వందాల్ కి ప్రచారం విపరీతంగా జరిగింది. విడుదలకి ముందు చాలా వివాదాలు కూడా సినిమాను వార్తల్లో ఉంచాయి. సూర్య నిర్మాత కావడం మరో పబ్లిసిటీ. అయితే ఇంత ప్రచారం పొందిన ఆ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో చూసినవాళ్లు పెదవి విరిచారు. విమర్శకులు కూడా మెచ్చుకోలేదు. దీంతో ఆ చిత్రానికి అంతగా ఆదరణ లేదు.
చిన్న సినిమా కనుక ఓటిటీ ఇచ్చిన అమౌంట్ ఓకే అయి ఉండొచ్చు. కానీ పెద్ద సినిమాలకు వ్యూస్ కూడా చాలా అవసరం. అదీగాక నెట్ లో సినిమా పెడితే పైరేట్స్ చేతిలో ఫుల్ హెచ్ డి ప్రింట్ పెట్టినట్టే. ఫలానా ఓటిటీలో ఉంది కదా అని జనం దానికి సబ్స్క్రయిబ్ చేసుకోరు. డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. అప్పుడు సదరు వ్యూస్ కౌంట్ లోకి రావు.
ఇన్నిరకాల తలనొప్పులు ఉండడంతో కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాని బొమ్మల పెట్టెలో చూపించడానికి నిర్మాతలు ఇష్టపడడం లేదు. ఆలస్యమయినా కానీ థియేటర్లు ఓపెన్ అయ్యాక విడుదల చేసుకుందాం అని వేచి చూస్తున్నారు.
This post was last modified on June 2, 2020 5:56 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, ఇదేసమయంలో కూటమి పార్టీల…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే…
వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో…
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…