ఓటిటీ వేదికగా సినిమాలు విడుదల చేయడం సినిమా ప్రియులకు ఆనందకరమే కానీ నిర్మాతలకు మాత్రం ఇది లాభదాయకం కాదు. కంటెంట్ నిజంగా బ్రహ్మాండంగా వుంటే జనం ఎగబడి చూస్తారు. ఫలానా సినిమా చూడమంటూ పదిమందికి చెప్తారు. అదే సినిమా అంతంతమాత్రంగా ఉన్నట్టయితే ఓటిటీలో ఫ్రీగా చూడ్డానికి కూడా జనం అంతగా ఇష్టపడరు.
తమిళం నుంచి విడుదలైన జ్యోతిక సినిమా పోన్మగల్ వందాల్ కి ప్రచారం విపరీతంగా జరిగింది. విడుదలకి ముందు చాలా వివాదాలు కూడా సినిమాను వార్తల్లో ఉంచాయి. సూర్య నిర్మాత కావడం మరో పబ్లిసిటీ. అయితే ఇంత ప్రచారం పొందిన ఆ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో చూసినవాళ్లు పెదవి విరిచారు. విమర్శకులు కూడా మెచ్చుకోలేదు. దీంతో ఆ చిత్రానికి అంతగా ఆదరణ లేదు.
చిన్న సినిమా కనుక ఓటిటీ ఇచ్చిన అమౌంట్ ఓకే అయి ఉండొచ్చు. కానీ పెద్ద సినిమాలకు వ్యూస్ కూడా చాలా అవసరం. అదీగాక నెట్ లో సినిమా పెడితే పైరేట్స్ చేతిలో ఫుల్ హెచ్ డి ప్రింట్ పెట్టినట్టే. ఫలానా ఓటిటీలో ఉంది కదా అని జనం దానికి సబ్స్క్రయిబ్ చేసుకోరు. డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. అప్పుడు సదరు వ్యూస్ కౌంట్ లోకి రావు.
ఇన్నిరకాల తలనొప్పులు ఉండడంతో కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాని బొమ్మల పెట్టెలో చూపించడానికి నిర్మాతలు ఇష్టపడడం లేదు. ఆలస్యమయినా కానీ థియేటర్లు ఓపెన్ అయ్యాక విడుదల చేసుకుందాం అని వేచి చూస్తున్నారు.
This post was last modified on June 2, 2020 5:56 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…