Movie News

నరేష్ మీద ‘మెగా’ ఆగ్రహం


సీనియర్ నటుడు నరేష్ గత పర్యాయం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మారడానికి పరోక్షంగా మెగా ఫ్యామిలీ సహకరించిందన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎన్నికలకు ముందు నరేష్.. చిరంజీవిని కలవడం.. ఆయన మద్దతు తనకుందని ప్రకటించుకోవడం గమనార్హం. ఇక నరేష్ అధ్యక్షుడు అయ్యాక జీవిత, రాజశేఖర్‌లతో అతడికి ఇబ్బందులు తలెత్తితే.. ‘మా’ వివాదాలకు కేంద్రంగా మారితే.. అప్పుడు చిరంజీవే పెద్దరికం వహించి సమస్యను పరిష్కరించారు.

ఒక సమావేశంలో నరేష్‌ను రాజశేఖర్ విమర్శిస్తుంటే వారించి చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఇలా నరేష్‌కు సహకరించిన చిరంజీవిపై ఇప్పుడు నరేష్ విషం చిమ్ముతున్నారనే అభిప్రాయం మెగా ఫ్యామిలీ వర్గాల్లో, అభిమానుల్లో బలంగా కలుగుతోంది. ఇందుక్కారణం ‘మా’ ఎన్నికలే.

చిరంజీవి మద్దతుతో ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీలో నిలిచినప్పటి నుంచి నరేష్ స్వరం మారిపోయింది. ప్రకాష్ రాజ్, నాగబాబు తన మీద పరోక్షంగా విమర్శలు గుప్పించడంతో ఆయన కొన్ని నెలల కిందటే ఎదురు దాడి మొదలుపెట్టారు. రాను రాను స్వరం పెంచారు. ప్రకాష్ రాజ్‌ మీద పోటీకి సై అన్న మంచు విష్ణుకు మద్దతుదారుగా మారి.. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు, ఎన్నికలపుడు, ఆ తర్వాత నరేష్ వ్యవహరించిన తీరు మెగా వర్గాలకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తోంది. అన్నింటికీ మించి మంచు విష్ణు సక్సెస్ ప్రెస్ మీట్లో నరేష్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆగ్రహాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

దాసరి నారాయణరావు తర్వాత ఇండస్ట్రీకి పెద్ద లేని లోటు ఏర్పడిందని.. ఆ స్థానాన్ని మోహన్ బాబు భర్తీ చేయాలని నరేష్ వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. దాసరి తర్వాత పెద్దరికం వహిస్తున్నది చిరంజీవి అని అందరికీ తెలుసు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ముందుకొస్తున్నారు. ముఖ్యంగా కరోనా టైంలో చిరంజీవి చేసిన కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చిరు ఇంత చేస్తే.. ఇప్పుడు దాసరి లేని లోటు కనిపిస్తోందని, మోహన్ బాబు ఆ స్థానంలోకి రావాలని నరేష్ వ్యాఖ్యానించడం మెగా క్యాంపుకే కాదు.. ఇండస్ట్రీలో చాలామందికి రుచించడం లేదు.

This post was last modified on October 12, 2021 8:56 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

32 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

48 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago