ఇండస్ట్రీలో పేరున్న ప్రముఖ పీఆర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఇటీవల వైజాగ్ వెళ్లిన ఆయన కొన్నిరోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈరోజు సడెన్ గా గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలించేలోపు ఆయన మరణించారు. ఈ విషయం సినీ, మీడియా వర్గాల్లో విషాదం నింపింది. మహేష్ కోనేరు చాలా ఏళ్లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర పీఆర్ఓగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు సంబంధించిన పనులతో పాటు కళ్యాణ్ రామ్ డేట్స్ కూడా చూసేవారు.
కానీ ఎన్టీఆర్ పీఆర్ఓగా ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. ‘118’, ‘మిస్ ఇండియా’, ‘తిమ్మరుసు’ వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలనుకున్నారు కానీ ఇంతలోనే కాలం చేశారు. మహేష్ కోనేరు మరణ వార్త విన్న ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. షాక్ లో ఉన్నానని, మాటలు రావడం లేదని ఎన్టీఆర్ అన్నారు. మహేష్ కోనేరు ఫ్యామిలీకి సంతాపం తెలియజేశారు ఎన్టీఆర్.
రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మహేష్ కోనేరు వివరణ కూడా ఇచ్చారు. ప్రమాదాలన్నింటికీ అతివేగం ఒక్కటే కారణం కాదని, సాయిధరమ్ తేజ్కు జరిగిన ప్రమాదం గురించి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కామెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బైక్ స్కిడ్ అయి యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ పోస్ట్ కూడా బాగా వైరల్ అయింది.
This post was last modified on October 12, 2021 11:32 am
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…