ఇండస్ట్రీలో పేరున్న ప్రముఖ పీఆర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఇటీవల వైజాగ్ వెళ్లిన ఆయన కొన్నిరోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈరోజు సడెన్ గా గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలించేలోపు ఆయన మరణించారు. ఈ విషయం సినీ, మీడియా వర్గాల్లో విషాదం నింపింది. మహేష్ కోనేరు చాలా ఏళ్లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర పీఆర్ఓగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు సంబంధించిన పనులతో పాటు కళ్యాణ్ రామ్ డేట్స్ కూడా చూసేవారు.
కానీ ఎన్టీఆర్ పీఆర్ఓగా ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. ‘118’, ‘మిస్ ఇండియా’, ‘తిమ్మరుసు’ వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలనుకున్నారు కానీ ఇంతలోనే కాలం చేశారు. మహేష్ కోనేరు మరణ వార్త విన్న ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. షాక్ లో ఉన్నానని, మాటలు రావడం లేదని ఎన్టీఆర్ అన్నారు. మహేష్ కోనేరు ఫ్యామిలీకి సంతాపం తెలియజేశారు ఎన్టీఆర్.
రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మహేష్ కోనేరు వివరణ కూడా ఇచ్చారు. ప్రమాదాలన్నింటికీ అతివేగం ఒక్కటే కారణం కాదని, సాయిధరమ్ తేజ్కు జరిగిన ప్రమాదం గురించి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కామెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బైక్ స్కిడ్ అయి యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ పోస్ట్ కూడా బాగా వైరల్ అయింది.
This post was last modified on October 12, 2021 11:32 am
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…