Movie News

నిర్మాత మహేష్ కోనేరు మృతి!

ఇండస్ట్రీలో పేరున్న ప్రముఖ పీఆర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఇటీవల వైజాగ్ వెళ్లిన ఆయన కొన్నిరోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈరోజు సడెన్ గా గుండెపోటు రావడంతో హాస్పిటల్ కి తరలించేలోపు ఆయన మరణించారు. ఈ విషయం సినీ, మీడియా వర్గాల్లో విషాదం నింపింది. మహేష్ కోనేరు చాలా ఏళ్లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర పీఆర్ఓగా పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు సంబంధించిన పనులతో పాటు కళ్యాణ్ రామ్ డేట్స్ కూడా చూసేవారు.

కానీ ఎన్టీఆర్ పీఆర్ఓగా ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. ‘118’, ‘మిస్ ఇండియా’, ‘తిమ్మరుసు’ వంటి చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలనుకున్నారు కానీ ఇంతలోనే కాలం చేశారు. మహేష్ కోనేరు మరణ వార్త విన్న ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. షాక్ లో ఉన్నానని, మాటలు రావడం లేదని ఎన్టీఆర్ అన్నారు. మహేష్ కోనేరు ఫ్యామిలీకి సంతాపం తెలియజేశారు ఎన్టీఆర్.

రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ పై మహేష్ కోనేరు వివరణ కూడా ఇచ్చారు. ప్రమాదాలన్నింటికీ అతివేగం ఒక్కటే కారణం కాదని, సాయిధరమ్‌ తేజ్‌కు జరిగిన ప్రమాదం గురించి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కామెంట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బైక్‌ స్కిడ్‌ అయి యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ పోస్ట్ కూడా బాగా వైరల్ అయింది.

This post was last modified on October 12, 2021 11:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

1 hour ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago