Political News

యూపీలోనే కాదు, ఉత్తరాఖండ్ లోనూ బీజేపీకి చావు దెబ్బ

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరప్రదేశ్ లో రైతుల గోల పెరిగిపోతుంటే పొరుగునే ఉన్న ఉత్తరాఖండ్ లో ముసలం మొదలైనట్లే ఉంది. రెండు రాష్ట్రాల్లోను బీజేపీనే అధికారంలో ఉండటంతో అధికార పార్టీ నేతలు నానా అవస్థలు పడుతున్నారు. ఉత్తరాఖండ్ లో ఓ మంత్రి తన కొడుకుతో పాటు హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఒక మంత్రే ఓ ఎంఎల్ఏ తో కలిసి బీజేపీకి రాజీనామా ఇచ్చేసి కాంగ్రెస్ లో చేరిపోతారని బీజేపీ అగ్రనేతలు ఏమాత్రం ఊహించలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే సీఎం పుష్కర్ థామి సింగ్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న యశ్ పాల్ ఆర్య హఠాత్తుగా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈయన కొడుకు, ఎంఎల్ఏ అయిన సంజీవ్ ఆర్య కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో తండ్రి, కొడుకులిద్దరు కాంగ్రెస్ లో చేరిపోవటాన్ని బీజేపీ అగ్రనేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఒకపుడు ఉత్తరాఖండ్ పీసీసీ అధ్యక్షుడిగా యశ్ పాల్ ఆర్య పనిచేశారు లేండి.

గడచిన నాలుగేళ్ళుగా ఉత్తరాఖండ్ లో బీజేపీ అవస్తలు పడుతునే ఉంది. అధికారంలో ఉందని తప్పిస్తే మిగిలిన అవస్తలంతా పడుతునే ఉంది. నాలుగేళ్ళలో ముగ్గురు సీఎంలు మారటమంటే పార్టీ ఎంతటి సంక్షోభంలో కొట్టుకుంటోందో అర్ధమవుతోంది. 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీకి మొదటి సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ బాధ్యతలు తీసుకున్నారు. మూడున్నరేళ్ల తర్వాత ఎంఎల్ఏల్లో వచ్చిన తిరుగుబాటు కారణంగా ఆయన స్థానంలో తిరత్ సింగ్ రావత్ ను కుర్చీలో కూర్చోబెట్టారు.

అయితే ఎంపీగా ఉన్న తిరత్ ను సీఎంగా కూర్చోబెట్టడం తో వెంటనే ఎంఎల్ఏల్లో అసంతృప్తి మొదలైపోయింది. సాధారణ ఎన్నికలు దగ్గర పడటంతో ఉపఎన్నికలకు అవకాశం లేకపోయింది. దాంతో ఎంఎల్ఏల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు వెంటనే తిరత్ ను దింపేసింది. ఆయన స్ధానంలో పుష్కర్ సింగ్ థామిని సీఎంను చేసింది. ఇంత చేసినా మంత్రులు, ఎంఎల్ఏల్లో అసంతృప్తి చల్లారలేదని అర్ధమైపోయింది. ఇందులో భాగంగానే మంత్రి ఆర్య రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు.

తొందరలోనే మరికొందరు మంత్రులు, ఎంఎల్ఏలు కూడా రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. జరుగుతున్నది చూస్తుంటే సరిగ్గా ఎన్నికలకు ముందు ఉత్తరాఖండ్ బీజేపీలో ముసలం మొదలవ్వబోతోందనే సంకేతాలు అందుతున్నాయి. మరి ముసలం కారణంగా చివరకు బీజేపీ పుట్టి మునుగుతుంది ఏమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.

This post was last modified on October 12, 2021 10:46 am

Share
Show comments

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago