ఇండియా అంతటా కరోనా వార్తలు బాగా తగ్గిపోయాయి. ముందు వేసిన అంచనాల ప్రకారం అక్టోబరులో థర్డ్ వేవ్ దేశాన్ని ఊపేస్తూ ఉండాలి. కానీ ఆ ప్రమాదం తప్పినట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది తప్ప పెరగట్లేదు. అలాగని కరోనా కథ ముగిసిందని మాత్రం అనుకోలేం. ఓ మోస్తరుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఈ మధ్య ప్రముఖులెవ్వరూ వైరస్ బారిన పడ్డట్లు వార్తలు రాలేదు. సినిమా ఈవెంట్లు చాలా మామూలుగా జరిగిపోతున్నాయి. సినిమాలు జోరుగా రిలీజవుతున్నాయి.
ఇలాంటి టైంలో ప్రముఖ కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ కరోనా బారిన పడటం ఆమె నటిస్తున్న ‘అఖండ’ చిత్ర బృందాన్ని కంగారు పెట్టేసింది. తాను కరోనా పాజిటివ్గా తేలినట్లు ప్రగ్యా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “అంతగా రుచించని వార్తతో ఆదివారం ఉదయం నిద్ర లేచాను. రెండుసార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ.. ఇప్పటికే ఓసారి కరోనా సోకినప్పటికీ.. మళ్లీ నేను కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్త వహిస్తూ ఐసొలేట్ అయ్యాను. గత పది రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అని ప్రగ్యా తన పోస్టులో పేర్కొంది.
గత పది రోజుల్లో ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్నది ‘అఖండ’ టీం సభ్యులే కాబట్టి వాళ్లకు ఆందోళన తప్పదు. గోవాలో కొన్ని రోజుల కిందటే ‘అఖండ’ చివరి షెడ్యూల్ ముగిసింది. ఆ తర్వాత చిత్ర బృందం ముగింపు వేడుకను కూడా చేసుకుంది. ఇందులో హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్లందరూ ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా మీడియాలోకి వచ్చాయి. కాబట్టి అందరూ పరీక్షలు చేయించుకోక తప్పదు. వారిలో ఎవరైనా పాజిటివ్గా తేలతారేమో చూడాలి మరి.
This post was last modified on October 10, 2021 8:58 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…