Movie News

‘అఖండ’ టీంలో కరోనా టెన్షన్


ఇండియా అంతటా కరోనా వార్తలు బాగా తగ్గిపోయాయి. ముందు వేసిన అంచనాల ప్రకారం అక్టోబరులో థర్డ్ వేవ్ దేశాన్ని ఊపేస్తూ ఉండాలి. కానీ ఆ ప్రమాదం తప్పినట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది తప్ప పెరగట్లేదు. అలాగని కరోనా కథ ముగిసిందని మాత్రం అనుకోలేం. ఓ మోస్తరుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఈ మధ్య ప్రముఖులెవ్వరూ వైరస్ బారిన పడ్డట్లు వార్తలు రాలేదు. సినిమా ఈవెంట్లు చాలా మామూలుగా జరిగిపోతున్నాయి. సినిమాలు జోరుగా రిలీజవుతున్నాయి.

ఇలాంటి టైంలో ప్రముఖ కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ కరోనా బారిన పడటం ఆమె నటిస్తున్న ‘అఖండ’ చిత్ర బృందాన్ని కంగారు పెట్టేసింది. తాను కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ప్రగ్యా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “అంతగా రుచించని వార్తతో ఆదివారం ఉదయం నిద్ర లేచాను. రెండుసార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ.. ఇప్పటికే ఓసారి కరోనా సోకినప్పటికీ.. మళ్లీ నేను కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్త వహిస్తూ ఐసొలేట్ అయ్యాను. గత పది రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అని ప్రగ్యా తన పోస్టులో పేర్కొంది.

గత పది రోజుల్లో ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్నది ‘అఖండ’ టీం సభ్యులే కాబట్టి వాళ్లకు ఆందోళన తప్పదు. గోవాలో కొన్ని రోజుల కిందటే ‘అఖండ’ చివరి షెడ్యూల్ ముగిసింది. ఆ తర్వాత చిత్ర బృందం ముగింపు వేడుకను కూడా చేసుకుంది. ఇందులో హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్లందరూ ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా మీడియాలోకి వచ్చాయి. కాబట్టి అందరూ పరీక్షలు చేయించుకోక తప్పదు. వారిలో ఎవరైనా పాజిటివ్‌గా తేలతారేమో చూడాలి మరి.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

22 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

7 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

7 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago