Movie News

‘అఖండ’ టీంలో కరోనా టెన్షన్


ఇండియా అంతటా కరోనా వార్తలు బాగా తగ్గిపోయాయి. ముందు వేసిన అంచనాల ప్రకారం అక్టోబరులో థర్డ్ వేవ్ దేశాన్ని ఊపేస్తూ ఉండాలి. కానీ ఆ ప్రమాదం తప్పినట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది తప్ప పెరగట్లేదు. అలాగని కరోనా కథ ముగిసిందని మాత్రం అనుకోలేం. ఓ మోస్తరుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే ఈ మధ్య ప్రముఖులెవ్వరూ వైరస్ బారిన పడ్డట్లు వార్తలు రాలేదు. సినిమా ఈవెంట్లు చాలా మామూలుగా జరిగిపోతున్నాయి. సినిమాలు జోరుగా రిలీజవుతున్నాయి.

ఇలాంటి టైంలో ప్రముఖ కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ కరోనా బారిన పడటం ఆమె నటిస్తున్న ‘అఖండ’ చిత్ర బృందాన్ని కంగారు పెట్టేసింది. తాను కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ప్రగ్యా సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “అంతగా రుచించని వార్తతో ఆదివారం ఉదయం నిద్ర లేచాను. రెండుసార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ.. ఇప్పటికే ఓసారి కరోనా సోకినప్పటికీ.. మళ్లీ నేను కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాను. వైద్యుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్త వహిస్తూ ఐసొలేట్ అయ్యాను. గత పది రోజుల్లో నాతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అని ప్రగ్యా తన పోస్టులో పేర్కొంది.

గత పది రోజుల్లో ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్నది ‘అఖండ’ టీం సభ్యులే కాబట్టి వాళ్లకు ఆందోళన తప్పదు. గోవాలో కొన్ని రోజుల కిందటే ‘అఖండ’ చివరి షెడ్యూల్ ముగిసింది. ఆ తర్వాత చిత్ర బృందం ముగింపు వేడుకను కూడా చేసుకుంది. ఇందులో హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీళ్లందరూ ప్రగ్యాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా మీడియాలోకి వచ్చాయి. కాబట్టి అందరూ పరీక్షలు చేయించుకోక తప్పదు. వారిలో ఎవరైనా పాజిటివ్‌గా తేలతారేమో చూడాలి మరి.

This post was last modified on October 10, 2021 8:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago