Movie News

కొండపొలానికి వెళ్లి క్రిష్ ఏం నేర్చుకున్నారు?

తెలుగు సినిమా దర్శకుల్లో క్రిష్ భిన్నమైన వ్యక్తి. తాను తీసే ప్రతి సినిమా కాస్త డిఫరెంట్ గా ఉండాలని నమ్మే దర్శకుల్లో ఆయన ఒకరు. క్రిష్ కథాంశాలు సగటు మనిషి తనను తాను ఐడెంటిఫై చేసుకునేలా ఉంటాయి. ఎంత కష్టమైన కథాంశం అయినా.. ఆసక్తికరంగా ఉండటమే కాదు.. అరటిపండు తోలు ఒలిచి చేతికి ఇచ్చినంత సింఫుల్ గా ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సమాజం పెద్దగా ఆలోచించని సాధారణ విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు.

తాజాగా ఆయన తీసిన మూవీ ‘కొండ పొలం’. హిట్ ఫ్లాపు అనే టాపిక్ ను పక్కన పెడితే అడవి.. గొర్రెలు.. వాటిని కాసే గొర్రెల కాపరుల జీవిత నేపథ్యంతో తీసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోందని చెప్పాలి. సినిమా విడుదల నేపథ్యంలో ఆయనో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ వేళ.. దాదాపు రెండు వేల గొర్రెలతో పని చేసిన ఆయన.. గొర్రెల నుంచి ఏమైనా నేర్చుకున్నారా? అంటే.. గొర్రెల నుంచి కాదు కానీ.. గొర్రెల కాపరుల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఏది ఈతకు వచ్చింది? దేనికి ముల్లు గుచ్చుకుంది? అనేది వాళ్లకు అవగాహన ఉంటుందని.. మన వృత్తిలో మనకెంత నైపుణ్యం ఉందో గొర్రెలు సాకడంలో వారికి అంత నైపుణ్యం ఉంటుంది. ఒక ఫిలిం మేకర్‌, పొలిటీషియన్‌లానే గొర్రెల కాపరి కష్టం ఎవరికంటే తక్కువ కాదు. అన్ని జీవులను వేసుకొని అడవిలో తిరగడం అంత సులభం కాదన్నారు. గొర్రెలు కాయడం చూసినంత తేలికైన విషయం కాదని, ఎంతో సునిశిత పరిశీలన అవసరమన్న విషయాన్ని క్రిష్ వివరించారు.

This post was last modified on October 10, 2021 8:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

1 hour ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago