మామూలు రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మారిన ‘మా’ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చేసింది. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు.. .ఘాటు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల హీట్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి వేళలో.. పోలింగ్ వాతావరణం ఎలా ఉంటుందన్న ప్రశ్న అందరిలో భారీ ఆసక్తిని రేపింది. కాసేపటి క్రితం ‘మా’ పోలింగ్ షురూ అయ్యింది.
ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ‘మా’ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మూడు ప్లటూన్ల బలగాల్ని ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మొహరించటమే కాదు.. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల పోలింగ్ కోసం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ను వేదికగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం మూడు గదుల్ని కేటాయించి.. ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపును ఈ రోజే పూర్తి చేయనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు విడుదల అవుతాయి.
బ్యాలెట్ పద్దతిలో సాగే పోలింగ్ లో 883 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు సినీతారలు ఉదయాన్నే రావడం మొదలైంది. అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న మంచు విష్ణు మొదటగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రకాశ్ రాజ్ వచ్చారు. రావటంతోనే అక్కడే ఉన్న విష్ణును చూసి.. ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న మోహన్ బాబును చూసి.. వెంటనే ఆయన కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. మోహన్ బాబు అందుకు నో చెప్పి.. ప్రకాశ్ రాజ్ భుజం తట్టిన వైనం అక్కడి వారిని విపరీతంగా ఆకర్షించింది. ఇలాంటి వాతావరణంలో పోలింగ్ ముగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on October 10, 2021 10:18 am
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…
పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ.. ఐప్యాక్పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏకకాలంలో గురువారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఐప్యాక్ సంస్థలకు…