Movie News

‘మా’ : మోహన్ బాబు కాళ్లకు ప్రకాశ్ రాజ్ నమస్కారం!

మామూలు రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మారిన ‘మా’ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చేసింది. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు.. .ఘాటు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల హీట్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి వేళలో.. పోలింగ్ వాతావరణం ఎలా ఉంటుందన్న ప్రశ్న అందరిలో భారీ ఆసక్తిని రేపింది. కాసేపటి క్రితం ‘మా’ పోలింగ్ షురూ అయ్యింది.

ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ‘మా’ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మూడు ప్లటూన్ల బలగాల్ని ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మొహరించటమే కాదు.. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల పోలింగ్ కోసం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ను వేదికగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం మూడు గదుల్ని కేటాయించి.. ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపును ఈ రోజే పూర్తి చేయనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు విడుదల అవుతాయి.

బ్యాలెట్ పద్దతిలో సాగే పోలింగ్ లో 883 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు సినీతారలు ఉదయాన్నే రావడం మొదలైంది. అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న మంచు విష్ణు మొదటగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రకాశ్ రాజ్ వచ్చారు. రావటంతోనే అక్కడే ఉన్న విష్ణును చూసి.. ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న మోహన్ బాబును చూసి.. వెంటనే ఆయన కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. మోహన్ బాబు అందుకు నో చెప్పి.. ప్రకాశ్ రాజ్ భుజం తట్టిన వైనం అక్కడి వారిని విపరీతంగా ఆకర్షించింది. ఇలాంటి వాతావరణంలో పోలింగ్ ముగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on October 10, 2021 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago