మామూలు రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మారిన ‘మా’ ఎన్నికల పోలింగ్ సమయం రానే వచ్చేసింది. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు.. .ఘాటు విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల హీట్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి వేళలో.. పోలింగ్ వాతావరణం ఎలా ఉంటుందన్న ప్రశ్న అందరిలో భారీ ఆసక్తిని రేపింది. కాసేపటి క్రితం ‘మా’ పోలింగ్ షురూ అయ్యింది.
ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ‘మా’ ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మూడు ప్లటూన్ల బలగాల్ని ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మొహరించటమే కాదు.. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల పోలింగ్ కోసం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ ను వేదికగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం మూడు గదుల్ని కేటాయించి.. ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపును ఈ రోజే పూర్తి చేయనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఫలితాలు విడుదల అవుతాయి.
బ్యాలెట్ పద్దతిలో సాగే పోలింగ్ లో 883 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో తమ ఓటు వేసేందుకు సినీతారలు ఉదయాన్నే రావడం మొదలైంది. అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న మంచు విష్ణు మొదటగా పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం ప్రకాశ్ రాజ్ వచ్చారు. రావటంతోనే అక్కడే ఉన్న విష్ణును చూసి.. ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న మోహన్ బాబును చూసి.. వెంటనే ఆయన కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశారు. అయితే.. మోహన్ బాబు అందుకు నో చెప్పి.. ప్రకాశ్ రాజ్ భుజం తట్టిన వైనం అక్కడి వారిని విపరీతంగా ఆకర్షించింది. ఇలాంటి వాతావరణంలో పోలింగ్ ముగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…