మామూలుగా ఒక పెద్ద హిట్ మూవీతో పరిచయమైన దర్శకుడు.. ఆ వెంటనే చకచకా తర్వాతి సినిమాలకు సన్నాహాలు చేసుకుంటాడు. రెండో సినిమాను వీలైనంత త్వరగా తీసేస్తుంటాడు. కానీ ఆర్ఎక్స్ 100 లాంటి బ్లాక్బస్టర్తో దర్శకుడిగా పరిచయమైన అజయ్ భూపతి మాత్రం రెండో సినిమాను పట్టాలెక్కించడానికి రెండేళ్లకు పైగానే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం.. తన కథకు తగ్గ హీరోలు దొరక్కపోవడం.
ఈ సినిమాను నాగచైతన్య, రవితేజ లాంటి వాళ్లకు చెప్పినా వాళ్లు ఒప్పుకున్నట్లే ఒప్పుకుని నో చెప్పేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఒక హీరో తనకు హ్యాండ్ ఇవ్వడం పట్ల అసహనంతో చీప్ స్టార్ అంటూ ఒక కామెంట్ కూడా చేశాడు అజయ్ అప్పట్లో. ఆ హీరో ఎవరనే విషయంలో కొన్ని ప్రచారాలు కూడా జరిగాయి. ఐతే చివరికి శర్వానంద్, సిద్దార్థ్లను హీరోలుగా ఖరారు చేసి సినిమా మొదలుపెట్టాడు. ముగించాడు. అక్టోబరు 14న దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో మహాసముద్రం ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా పట్టాలెక్కడానికి ముందు జరిగిన సంగతులను అజయ్ గుర్తు చేసుకున్నాడు. ఈ కథను తాను చాలామంది హీరోలకు చెప్పానన్నాడు. అజయ్ ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే కాబట్టి.. తనీ మాటెత్తగానే ఎవరి మీద ఏం విమర్శలు చేస్తాడో, కౌంటర్లు వేస్తాడో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కానీ అజయ్ వివాదాల జోలికి వెళ్లకుండా పాజిటివ్ కామెంటే చేశాడు. ఇది ఇద్దరు హీరోల కథ కావడంతో కొందరు ఈ చిత్రం చేయడానికి వెనుకంజ వేశారని, సోలో హీరో అయితేనే చేయాలనుకుంటున్నట్లు చెప్పారని.. అలా నో చెప్పిన వాళ్లు కూడా వేరే వాళ్ల దగ్గర మహాసముద్రం కథ గురించి గొప్పగా చెప్పారని అజయ్ అన్నాడు.
ఇక శర్వానంద్, సిద్దార్థ్లతో ఈ సినిమా మొదలుపెట్టినపుడు.. వీళ్లను ఎలా హ్యాండిల్ చేస్తావో చూస్తాం అంటూ కొందరు వార్నింగ్ ఇచ్చారని.. కానీ ఆ ఇద్దరూ తనకు ఎంతగానో సహకరించి, తానేం చెబితే అది చేశారని అజయ్ తెలిపాడు. ఈ సినిమా బ్లాక్బస్టర్ కావడం ఖాయమని, ఇది రాసిపెట్టుకోవాలని, పోస్టర్లు కూడా రెడీ చేసుకోవచ్చని అజయ్ ధీమాగా చెప్పడం విశేషం.
This post was last modified on October 10, 2021 10:27 am
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…