పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఒకదాని తరువాత మరొక సినిమా ప్రకటన అయితే వస్తుంది కానీ ఆ సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. సాధారణంగా అయితే ప్రభాస్ ఒక సినిమాను పూర్తి చేసి మరొక సినిమా సెట్స్ పైకి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు తన జోరు పెంచారు. ‘రాధేశ్యామ్’ సినిమా సెట్స్ పై ఉండగానే.. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల షూటింగ్ మొదలుపెట్టారు.
ప్రభాస్ ఇంత వేగంగా ఎందుకు సినిమాలను మొదలుపెడుతున్నారంటే.. ఆయనకి పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమాలను ఫైనలైజ్ చేసి అడ్వాన్స్ పేమెంట్స్ తీసుకుంటున్నారట. మరో రెండు, మూడు ఏళ్లలో ఆయన అనౌన్స్ చేసిన సినిమాలన్నీ పూర్తి చేయగలిగితే ప్రభాస్ కి మొత్తం రూ.600 కోట్ల రెమ్యునరేషన్ అందుతుంది.
ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ప్రభాస్ ముందుంటారు. ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల చొప్పున తీసుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఈ రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు దాంతో పాటు ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ చేశారు. ఇది కాకుండా మైత్రితో మరో సినిమా కమిట్ అయ్యారు. ఆ లెక్కన చూసుకుంటే మొత్తం ఈ సినిమాల ద్వారా రూ.600 కోట్లు సంపాదించబోతున్నారన్నమాట!
This post was last modified on October 9, 2021 6:11 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…