పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఒకదాని తరువాత మరొక సినిమా ప్రకటన అయితే వస్తుంది కానీ ఆ సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతాయనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. సాధారణంగా అయితే ప్రభాస్ ఒక సినిమాను పూర్తి చేసి మరొక సినిమా సెట్స్ పైకి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు తన జోరు పెంచారు. ‘రాధేశ్యామ్’ సినిమా సెట్స్ పై ఉండగానే.. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల షూటింగ్ మొదలుపెట్టారు.
ప్రభాస్ ఇంత వేగంగా ఎందుకు సినిమాలను మొదలుపెడుతున్నారంటే.. ఆయనకి పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమాలను ఫైనలైజ్ చేసి అడ్వాన్స్ పేమెంట్స్ తీసుకుంటున్నారట. మరో రెండు, మూడు ఏళ్లలో ఆయన అనౌన్స్ చేసిన సినిమాలన్నీ పూర్తి చేయగలిగితే ప్రభాస్ కి మొత్తం రూ.600 కోట్ల రెమ్యునరేషన్ అందుతుంది.
ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోల్లో ప్రభాస్ ముందుంటారు. ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల చొప్పున తీసుకుంటున్నారు. ‘రాధేశ్యామ్’ సినిమా నుంచి ఈ రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు దాంతో పాటు ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ K’ సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ సినిమా అనౌన్స్ చేశారు. ఇది కాకుండా మైత్రితో మరో సినిమా కమిట్ అయ్యారు. ఆ లెక్కన చూసుకుంటే మొత్తం ఈ సినిమాల ద్వారా రూ.600 కోట్లు సంపాదించబోతున్నారన్నమాట!
This post was last modified on October 9, 2021 6:11 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…