టాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా సెట్టయినా హీరోయిన్గా మొదట వినిపించేది పూజా హెగ్డే పేరే. అంతలా క్రేజ్ పెరిగిపోయింది తనకి. రీసెంట్గా ఆమె పవన్ కళ్యాణ్తో నటిస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అఫీషియల్గా ఎవరూ అనౌన్స్ చేయకపోవడంతో రూమరేమో అనుకున్నారంతా. కానీ అది పుకారు కాదు, నిజమేనని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
ఈ నెల 15న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’తో కలిసి థియేటర్స్లో సందడి చేయబోతోంది పూజ. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పూజ, పవన్ల కాంబోని ఖరారు చేశాడు హరీష్ శంకర్. ఈ ఈవెంట్లో పూజని చాలా పొగిడేశాడు హరీష్. ‘కరోనా టైమ్లో అందరూ ఖాళీగా ఉన్నారు.. ఒక్కరు తప్ప. తనకి కరోనా లేదు. లాక్డౌన్ లేదు. ఎప్పుడు చూసినా పని పని. అంతే. తనెవరో కాదు పూజా హెగ్డే. హీరోయిన్ల డేట్స్ షూటింగ్ కోసం తీసుకుంటూ ఉంటాం. కానీ పూజతో ఫోన్లో మాట్లాడ్డానికి కూడా డేట్స్ తీసుకోవాల్సి వస్తోంది’ అన్న హరీష్.. ‘ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది’ అని చెప్పాడు.
ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ చేస్తోంది పూజ. మహేష్, త్రివిక్రమ్ల సినిమాలోనూ తనే హీరోయిన్. ఇప్పుడు హరీష్ కామెంట్స్తో పవన్ సినిమా విషయంలో ఉన్న డౌట్ కూడా క్లియరైపోయింది. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్సింగ్’లో పవన్కి జంటగా పూజయే నటిస్తోందని కన్ఫర్మ్ అయ్యింది. ఆల్రెడీ హరీష్ తీసిన డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో ఆమె నటించింది. పైగా పూజ అంటే తనకి ఇష్టమని, తనతో పని చేయడం బాగుంటుందని గతంలో హరీష్ కూడా అన్నాడు. కాబట్టి పవన్ కోసం కూడా ఆమెనే సెలెక్ట్ చేసి ఉంటాడు.
మరోవైపు తమిళంలో విజయ్తో ‘బీస్ట్’ మూవీ చేస్తూ అక్కడి స్టార్ హీరోల సినిమాలనూ బ్యాగ్లో వేసుకోడానికి రెడీ అయ్యింది పూజ. అటు నార్త్లోనూ సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ లాంటి బిగ్ హీరోస్తో నటిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఎక్కడ చూసినా పూజ హవానే నడుస్తోంది.
This post was last modified on October 9, 2021 12:04 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…