టాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా సెట్టయినా హీరోయిన్గా మొదట వినిపించేది పూజా హెగ్డే పేరే. అంతలా క్రేజ్ పెరిగిపోయింది తనకి. రీసెంట్గా ఆమె పవన్ కళ్యాణ్తో నటిస్తోందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అఫీషియల్గా ఎవరూ అనౌన్స్ చేయకపోవడంతో రూమరేమో అనుకున్నారంతా. కానీ అది పుకారు కాదు, నిజమేనని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
ఈ నెల 15న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’తో కలిసి థియేటర్స్లో సందడి చేయబోతోంది పూజ. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పూజ, పవన్ల కాంబోని ఖరారు చేశాడు హరీష్ శంకర్. ఈ ఈవెంట్లో పూజని చాలా పొగిడేశాడు హరీష్. ‘కరోనా టైమ్లో అందరూ ఖాళీగా ఉన్నారు.. ఒక్కరు తప్ప. తనకి కరోనా లేదు. లాక్డౌన్ లేదు. ఎప్పుడు చూసినా పని పని. అంతే. తనెవరో కాదు పూజా హెగ్డే. హీరోయిన్ల డేట్స్ షూటింగ్ కోసం తీసుకుంటూ ఉంటాం. కానీ పూజతో ఫోన్లో మాట్లాడ్డానికి కూడా డేట్స్ తీసుకోవాల్సి వస్తోంది’ అన్న హరీష్.. ‘ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది’ అని చెప్పాడు.
ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ చేస్తోంది పూజ. మహేష్, త్రివిక్రమ్ల సినిమాలోనూ తనే హీరోయిన్. ఇప్పుడు హరీష్ కామెంట్స్తో పవన్ సినిమా విషయంలో ఉన్న డౌట్ కూడా క్లియరైపోయింది. హరీష్ శంకర్ ‘భవదీయుడు భగత్సింగ్’లో పవన్కి జంటగా పూజయే నటిస్తోందని కన్ఫర్మ్ అయ్యింది. ఆల్రెడీ హరీష్ తీసిన డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో ఆమె నటించింది. పైగా పూజ అంటే తనకి ఇష్టమని, తనతో పని చేయడం బాగుంటుందని గతంలో హరీష్ కూడా అన్నాడు. కాబట్టి పవన్ కోసం కూడా ఆమెనే సెలెక్ట్ చేసి ఉంటాడు.
మరోవైపు తమిళంలో విజయ్తో ‘బీస్ట్’ మూవీ చేస్తూ అక్కడి స్టార్ హీరోల సినిమాలనూ బ్యాగ్లో వేసుకోడానికి రెడీ అయ్యింది పూజ. అటు నార్త్లోనూ సల్మాన్ ఖాన్, రణ్వీర్ సింగ్ లాంటి బిగ్ హీరోస్తో నటిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఎక్కడ చూసినా పూజ హవానే నడుస్తోంది.
This post was last modified on October 9, 2021 12:04 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…