ఎంత పెద్ద దర్శకుడైనా.. అరంగేట్రం చేయడానికి ముందు అనామకుడే. చాలా కొద్ది మందికి మాత్రమే తొలి చిత్రానికి పేరున్న హీరో హీరోయిన్లు, నిర్మాతలతో పని చేసే అవకాశం వస్తుంది. మెజారిటీ దర్శకులు అరంగేట్ర చిత్రాన్ని పట్టాలెక్కించడానికి.. దాన్ని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. బడ్జెట్ సరిపోక.. అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయలేక.. చిత్రానికి అనుకున్నంత బజ్ రాక.. రిలీజ్ తర్వాత ఆశించిన ఫలితాన్ని అందుకోలేక ఇబ్బంది పడే దర్శకులు ఎందరో.
యువ దర్శకుడు సందీప్ రెడ్డి సైతం తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ మేకింగ్ టైంలో చాలా ఇబ్బందులే పడ్డాడు. ఆ సినిమాను పూర్తి చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నాడు. బడ్జెట్ కష్టాలు అతణ్ని వేధించాయి. ఐతే ఇవన్నీ ఫస్ట్ టీజర్ రిలీజయ్యే వరకే. ఆ టీజర్ బయటికి రాగానే మొత్తం కథ మారిపోయింది. ఆ చిత్రానికి అనూహ్యమైన హైప్ వచ్చింది. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఒక చరిత్ర.
తొలి సినిమాతో రాత్రికి రాత్రి జీవితాలను మార్చేసుకున్న దర్శకులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్లందరినీ మించిన ఎదుగుదల సందీప్ రెడ్డిది. కేవలం ‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన పేరుతో అతను బాలీవుడ్లో పెద్ద నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షించాడు. ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’కు దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నాడు. ఆ చిత్రానికి షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరోతో పని చేసే ఛాన్స్ పట్టేశాడు. ఆ చిత్రం కూడా బ్లాక్బస్టర్ అవడంతో సందీప్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు.
రణబీర్ కపూర్తో ‘ఎనిమల్’ లాంటి మరో పెద్ద సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ఆ సినిమా మేకింగ్ దశలో ఉండగానే ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అది కూడా ప్రభాస్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ చిత్రం సందీప్ చేతికి వచ్చింది. ఇదంతా కూడా ‘అర్జున్ రెడ్డి’ చలవే. ఈ సినిమాను దాటి కొత్త కథతో సందీప్ ఇంకా రుజువు చేసుకోలేదు. ఈలోపే ప్రభాస్తో ప్రెస్టీజియస్ మూవీ చేసే అవకాశం అందుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికిది రుజువు. ఒక్క సినిమాతో ఇలాంటి ఎదుగుదల భారతీయ సినిమా చరిత్రలోనే అరుదు అనడంలో సందేహం లేదు.
This post was last modified on October 8, 2021 10:40 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…