‘బాహుబలి’తో అనుకోకుండా అన్నీ కలిసొచ్చి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని.. కానీ ఆ ఇమేజ్ను నిలబెట్టుకోవడం అంత తేలిక కాదని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. అందులోనూ ‘బాహుబలి’ తర్వాతి చిత్రం ‘సాహో’ అంచనాలను అందుకోలేకపోవడం, దాని తర్వాతి సినిమా ‘రాధేశ్యామ్’కు అనుకున్నంత బజ్ రాకపోవడంతో ప్రభాస్ పనైపోయిందని తీసి పడేసిన వాళ్లూ ఉన్నారు. కానీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతడికున్న డిమాండ్ ఏంటో తర్వాత అతను సెట్ చేసుకున్న ఒక్కో ప్రాజెక్టును బట్టి అందరికీ అర్థమవుతోంది.
వివిధ ఇండస్ట్రీల నుంచి పేరున్న దర్శకులు, నిర్మాతలు ప్రభాస్ కోసం క్యూలు కట్టేస్తున్నారు. అతణ్ని నమ్మి భారీ కథలు, వందల కోట్ల బడ్జెట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే లాంటి మెగా మూవీస్ను లైన్లో పెట్టాడు ప్రభాస్. వీటిలో స్థాయి పరంగా ఒకదాన్ని మించిన సినిమా ఇంకోటి.
ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ అనే మరో స్పెషల్ మూవీని ప్రకటించాడు ప్రభాస్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీని మీదా వందల కోట్ల బడ్జెట్ ఉంటుందనడంలో, సాంకేతికంగా ప్రపంచ స్థాయి సినిమాలకు దీటుగా ఇది రూపొందుతుందనడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్లో అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఒకటుంది. ప్రస్తుతం కాస్త పేరున్న సినిమాలన్నింటికీ ‘పాన్ ఇండియా’ ట్యాగ్ వేసేస్తుండటం తెలిసిందే. ఇందులో చాలా వరకు ఒక భాషలో తీసి, ఇతర భాషల్లో అనువాదం చేయడమే ఉంటోంది. చాలా భాషల్లో నామమాత్రంగానే ఆ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
కానీ ప్రభాస్ సినిమాలు మాత్రం ‘ట్రూ పాన్ ఇండియా’ తరహాలో రూపొందుతున్నాయి. దేశ్యాప్తంగా అతడికున్న ఫాలోయింగ్ అలాంటిది. కాగా ‘స్పిరిట్’ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనే కాక మూడు విదేశీ భాషల్లోనూ రూపొందించబోతుండటం విశేషం. అది కూడా చైనీస్, జపనీస్, ఇంకో విదేశీ భాషలో కావడం విశేషం. భారతీయ భాషల్లో సినిమా తీసి.. తర్వాత వీలును బట్టి విదేశీ భాషల్లో అనువాదం చేసి రిలీజ్ చేయడం చూశాం కానీ.. ఇలా ముందే చైనీస్, జపనీస్ భాషల్లో సినిమా తెరకెక్కబోతున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్లో వెల్లడించడం నభూతో. దీన్ని బట్టి ప్రభాస్ రేంజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…