యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మరోసారి తన దూకుడు చూపించాడు. ‘రాధేశ్యామ్’ లాంటి భారీ చిత్రాన్ని పూర్తి చేసి.. అంతకుమించిన మూడు భారీ చిత్రాలను లైన్లో పెట్టి సమాంతరంగా అందులో రెండు చిత్రాల షూటింగ్లో పాల్గొంటూ.. మూడో సినిమా షూటింగ్కు కూడా సన్నాహాలు చేసుకుంటున్న ప్రభాస్.. ఇప్పుడు నాలుగో సినిమాను ప్రకటించాడు. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అనదగ్గ 25వ చిత్రాన్ని గురువారమే ప్రభాస్ ప్రకటించాడు.
కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో, టీ సిరీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో సందీప్ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్లకు కూడా కూడా నిర్మాణ భాగస్వామ్యం ఉండటం విశేషం. ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయమే పట్టేట్లుంది. 2023లో కానీ ఇది పట్టాలెక్కకపోవచ్చు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ టైటిల్ ఆధారంగా ఈ సినిమా కథేమై ఉంటుంది.. ఎందుకీ టైటిల్ పెట్టారు అనే చర్చలు మొదలైపోయాయి. మామూలుగా అయితే ఈ టైటిల్ను చూసే దృష్టికోణం వేరుగా ఉండేది కానీ.. సందీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో అతడి తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ దృష్టికోణంలో దీన్ని చూస్తున్నారు. ‘స్పిరిట్’ అంటే మద్యం కోసం వాడే స్పిరిట్ అయి ఉండొచ్చేమో.. ఇది మద్యం, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథ అయ్యుండొచ్చేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా ఈ సినిమా డార్క్ థీమ్తోనే ఉంటుందని.. సందీప్ తన స్టయిల్లో క్రేజీగా ఈ సినిమాను తీర్చిదిద్దుతాడని అంటున్నారు.
మరోవైపు ‘స్పిరిట్’ అంటే ‘స్ఫూర్తి’ అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి సందీప్ తన శైలికి భిన్నంగా.. ఏదైనా స్ఫూర్తిదాయక, సందేశాత్మక సినిమా ఏమైనా చేయబోతున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ సందీప్ అలాంటి సినిమా చేసే అవకాశం తక్కువే. రాబోయే రోజుల్లో ఈ టైటిల్ గురించి సందీప్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూద్దాం. ప్రస్తుతం అతను రణబీర్ కపూర్ హీరోగా ‘ఎనిమల్’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 7, 2021 2:43 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…