యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మరోసారి తన దూకుడు చూపించాడు. ‘రాధేశ్యామ్’ లాంటి భారీ చిత్రాన్ని పూర్తి చేసి.. అంతకుమించిన మూడు భారీ చిత్రాలను లైన్లో పెట్టి సమాంతరంగా అందులో రెండు చిత్రాల షూటింగ్లో పాల్గొంటూ.. మూడో సినిమా షూటింగ్కు కూడా సన్నాహాలు చేసుకుంటున్న ప్రభాస్.. ఇప్పుడు నాలుగో సినిమాను ప్రకటించాడు. తన కెరీర్లో మైల్ స్టోన్ మూవీ అనదగ్గ 25వ చిత్రాన్ని గురువారమే ప్రభాస్ ప్రకటించాడు.
కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో, టీ సిరీస్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో సందీప్ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్లకు కూడా కూడా నిర్మాణ భాగస్వామ్యం ఉండటం విశేషం. ఈ సినిమా పట్టాలెక్కడానికి మాత్రం చాలా సమయమే పట్టేట్లుంది. 2023లో కానీ ఇది పట్టాలెక్కకపోవచ్చు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్ పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ టైటిల్ ఆధారంగా ఈ సినిమా కథేమై ఉంటుంది.. ఎందుకీ టైటిల్ పెట్టారు అనే చర్చలు మొదలైపోయాయి. మామూలుగా అయితే ఈ టైటిల్ను చూసే దృష్టికోణం వేరుగా ఉండేది కానీ.. సందీప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో అతడి తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ దృష్టికోణంలో దీన్ని చూస్తున్నారు. ‘స్పిరిట్’ అంటే మద్యం కోసం వాడే స్పిరిట్ అయి ఉండొచ్చేమో.. ఇది మద్యం, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథ అయ్యుండొచ్చేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా ఈ సినిమా డార్క్ థీమ్తోనే ఉంటుందని.. సందీప్ తన స్టయిల్లో క్రేజీగా ఈ సినిమాను తీర్చిదిద్దుతాడని అంటున్నారు.
మరోవైపు ‘స్పిరిట్’ అంటే ‘స్ఫూర్తి’ అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి సందీప్ తన శైలికి భిన్నంగా.. ఏదైనా స్ఫూర్తిదాయక, సందేశాత్మక సినిమా ఏమైనా చేయబోతున్నాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ సందీప్ అలాంటి సినిమా చేసే అవకాశం తక్కువే. రాబోయే రోజుల్లో ఈ టైటిల్ గురించి సందీప్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూద్దాం. ప్రస్తుతం అతను రణబీర్ కపూర్ హీరోగా ‘ఎనిమల్’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on October 7, 2021 2:43 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…