Movie News

కథ లేదు కానీ బాలయ్యతో సినిమా పక్కా..!

నందమూరి బాలకృష్ణ-బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు దర్శకుడు బి.గోపాల్. ఆయన తెరకెక్కిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బి.గోపాల్. ఇందులో భాగంగా బాలయ్యతో సినిమాపై స్పందించారు.

బాలయ్యతో త్వరలోనే సినిమా తీస్తానని చెప్పేశారు. మంచి కథ కోసం వెతుకుతున్నామని.. కొన్ని కథలు విన్నానని.. అయితే ఇప్పటివరకు ఏ కథను లాక్ చేయలేదని అన్నారు. త్వరలోనే కథ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగైదు సినిమాలు వచ్చాయి. అందులో ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాయి.

ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే కథనే చేస్తారంటూ టాక్ నడుస్తోంది. బి.గోపాల్ కూడా సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ కథా చిత్రాల్లో మైలు రాయి అని.. బాలయ్యతో మళ్లీ అలాంటి సినిమానే చేయాలనుంది అంటూ ముక్తాయించారు.

దీంతో అలాంటి కథతోనే సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బాలయ్య చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రస్తుతం ‘అఖండ’ పూర్తి చేసిన ఆయన ఆ తరువాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. మరి బి.గోపాల్ తో ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి!

Satya

Recent Posts

టాలీవుడ్ ఎక్కడ పొరపాటు చేస్తోంది

బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…

2 hours ago

మహేష్ పుట్టినరోజుకి ఫోటోలు సరిపోవు

వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…

4 hours ago

ప్యాడెడ్, బంప్ బ్రాల కోసం ఒత్తిడి తెచ్చేవాళ్లు – స‌మీరా రెడ్డి

తాను క‌థానాయిక‌గా న‌టించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమ‌ని ఫిలిం మేక‌ర్స్ విప‌రీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్ల‌ని స‌మీరా…

4 hours ago

ప్రధాని మోడీకి కాక్రోచ్ సెగ తగులుతుందా?

దేశ రాజ‌ధాని ఢిల్లీ ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రుల‌తో…

5 hours ago

ప్రియాంకా, రాహుల్, రేవంత్ లకు డెత్ డిక్లరేషన్: కేటీఆర్

కొలువులు అడిగితే యువ‌త‌ను పోలీసుల‌తో కొట్టిస్తున్నార‌ని.. కాంగ్రెస్‌కు డెత్ డిక్ల‌రేష‌న్ రాసే స‌మ‌యం వ‌చ్చింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

5 hours ago

భర్త క్షేమం కోసం తిరుమలలో కాలి నడకన పవన్ భార్య

జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…

5 hours ago