నందమూరి బాలకృష్ణ-బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు దర్శకుడు బి.గోపాల్. ఆయన తెరకెక్కిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బి.గోపాల్. ఇందులో భాగంగా బాలయ్యతో సినిమాపై స్పందించారు.
బాలయ్యతో త్వరలోనే సినిమా తీస్తానని చెప్పేశారు. మంచి కథ కోసం వెతుకుతున్నామని.. కొన్ని కథలు విన్నానని.. అయితే ఇప్పటివరకు ఏ కథను లాక్ చేయలేదని అన్నారు. త్వరలోనే కథ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగైదు సినిమాలు వచ్చాయి. అందులో ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాయి.
ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే కథనే చేస్తారంటూ టాక్ నడుస్తోంది. బి.గోపాల్ కూడా సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ కథా చిత్రాల్లో మైలు రాయి అని.. బాలయ్యతో మళ్లీ అలాంటి సినిమానే చేయాలనుంది అంటూ ముక్తాయించారు.
దీంతో అలాంటి కథతోనే సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బాలయ్య చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రస్తుతం ‘అఖండ’ పూర్తి చేసిన ఆయన ఆ తరువాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. మరి బి.గోపాల్ తో ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి!
This post was last modified on October 7, 2021 8:43 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…