టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన తమన్నా.. రీసెంట్ గానే బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై తన అందాలతో మెప్పించిన మిల్కీబ్యూటీ బుల్లితెరపై ‘మాస్టర్ చెఫ్’ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ మధ్యనే ఈ షోని టెలికాస్ట్ చేస్తున్నారు.
హోస్ట్ గా తమన్నాకు మంచి పేరే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ప్లేస్ లో స్టార్ యాంకర్ అనసూయను తీసుకోవాలని భావిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. రాబోయే ఎపిసోడ్స్ కి హోస్ట్ గా తమన్నా స్థానంలో అనసూయ కనిపిస్తుందట.
కొన్నిరోజుల్లో ఈ షో మొదటి సీజన్ పూర్తికానుంది. అయితే తమన్నా ఇచ్చిన డేట్స్ ని షో నిర్వాహకులు సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఆమెకి సినిమా కమిట్మెంట్స్ ఉండడంతో ‘మాస్టర్ చెఫ్’కి ఎక్కువ డేట్స్ ని కేటాయించలేకపోతుంది. దీంతో నిర్వాహకులు ఆమెకి బదులుగా అనసూయని రంగంలోకి దించారు. ఇప్పటికే బెంగుళూరులో నిర్వహించిన ఓ ఎపిసోడ్ షూటింగ్ లో అనసూయ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సీజన్ లో ఉన్న మిగిలిన ఎపిసోడ్స్ కి అనసూయ యాంకరింగ్ చేయబోతుంది.
ఆ తరువాత సెమీ ఫైనల్స్, ఫైనల్ ఎపిసోడ్స్ లో మళ్లీ తమన్నా కనిపిస్తుందని అంటున్నారు. కొన్ని ఎపిసోడ్స్ అయినప్పటికీ అనసూయ మంచి ఛాన్స్ పట్టేసిందనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ హోస్ట్ చేసిన షోలో అనసూయను తీసుకున్నారంటే ఆమెకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. దీనికి గాను అనసూయకి మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. మరి ఈ షోతో అనసూయకి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…