యువి క్రియేషన్స్ వరస్ట్ బేనర్.. ఈ మధ్య ట్విట్టర్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ పని చేసింది ప్రభాస్ అభిమానులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాహో మొదలైన దగ్గర్నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ సమయానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వదని, వారి కోసం కానుకలేమీ రెడీ చేయదని వాళ్లు మండిపడుతుంటారు.
ఈ విషయంలో ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ వద్దకెళ్లి గొడవ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. అయినా ఆ సంస్థ ప్రభాస్ కొత్త సినిమా విషయంలోనూ అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లు నడుచుకోవట్లేదు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ 70-80 శాతం పూర్తయినా ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ లేదు. వాటి గురించి అప్ డేట్ కూడా లేదు.
ఐతే ఈ మధ్య ప్రభాస్ అభిమానులు మరోసారి విరుచుకుపడేసరికి.. ఆ సంస్థ స్పందించింది. లాక్ డౌన్ ముగిసి, సినీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాక అప్ డేట్ ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సడలింపులిచ్చి షూటింగ్స్ త్వరలోనే పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సంస్థ మాట నిలుపుకోనుంది. సోమవారం చిత్ర పీఆర్ వర్గాలు ఈ మేరకు అభిమానులకు ఇన్ పుట్స్ ఇచ్చాయి.
జూన్ ప్రభాస్ అభిమానుల నెల అని.. వారికి కానుక సిద్ధమవుతోందని కొందరు టాలీవుడ్ పీఆర్వోలు సంకేతాలిచ్చారు. బహుశా ఈ నెల మధ్యలో టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశముంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధేశ్యామ్, జాన్ అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. యువి వాళ్లతో కలిసి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on June 2, 2020 12:53 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…