యువి క్రియేషన్స్ వరస్ట్ బేనర్.. ఈ మధ్య ట్విట్టర్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ పని చేసింది ప్రభాస్ అభిమానులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాహో మొదలైన దగ్గర్నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ సమయానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వదని, వారి కోసం కానుకలేమీ రెడీ చేయదని వాళ్లు మండిపడుతుంటారు.
ఈ విషయంలో ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ వద్దకెళ్లి గొడవ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. అయినా ఆ సంస్థ ప్రభాస్ కొత్త సినిమా విషయంలోనూ అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లు నడుచుకోవట్లేదు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ 70-80 శాతం పూర్తయినా ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ లేదు. వాటి గురించి అప్ డేట్ కూడా లేదు.
ఐతే ఈ మధ్య ప్రభాస్ అభిమానులు మరోసారి విరుచుకుపడేసరికి.. ఆ సంస్థ స్పందించింది. లాక్ డౌన్ ముగిసి, సినీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాక అప్ డేట్ ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సడలింపులిచ్చి షూటింగ్స్ త్వరలోనే పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సంస్థ మాట నిలుపుకోనుంది. సోమవారం చిత్ర పీఆర్ వర్గాలు ఈ మేరకు అభిమానులకు ఇన్ పుట్స్ ఇచ్చాయి.
జూన్ ప్రభాస్ అభిమానుల నెల అని.. వారికి కానుక సిద్ధమవుతోందని కొందరు టాలీవుడ్ పీఆర్వోలు సంకేతాలిచ్చారు. బహుశా ఈ నెల మధ్యలో టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశముంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధేశ్యామ్, జాన్ అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. యువి వాళ్లతో కలిసి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…