యువి క్రియేషన్స్ వరస్ట్ బేనర్.. ఈ మధ్య ట్విట్టర్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ పని చేసింది ప్రభాస్ అభిమానులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాహో మొదలైన దగ్గర్నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ సమయానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వదని, వారి కోసం కానుకలేమీ రెడీ చేయదని వాళ్లు మండిపడుతుంటారు.
ఈ విషయంలో ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ వద్దకెళ్లి గొడవ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. అయినా ఆ సంస్థ ప్రభాస్ కొత్త సినిమా విషయంలోనూ అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లు నడుచుకోవట్లేదు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ 70-80 శాతం పూర్తయినా ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ లేదు. వాటి గురించి అప్ డేట్ కూడా లేదు.
ఐతే ఈ మధ్య ప్రభాస్ అభిమానులు మరోసారి విరుచుకుపడేసరికి.. ఆ సంస్థ స్పందించింది. లాక్ డౌన్ ముగిసి, సినీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాక అప్ డేట్ ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సడలింపులిచ్చి షూటింగ్స్ త్వరలోనే పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సంస్థ మాట నిలుపుకోనుంది. సోమవారం చిత్ర పీఆర్ వర్గాలు ఈ మేరకు అభిమానులకు ఇన్ పుట్స్ ఇచ్చాయి.
జూన్ ప్రభాస్ అభిమానుల నెల అని.. వారికి కానుక సిద్ధమవుతోందని కొందరు టాలీవుడ్ పీఆర్వోలు సంకేతాలిచ్చారు. బహుశా ఈ నెల మధ్యలో టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశముంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధేశ్యామ్, జాన్ అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. యువి వాళ్లతో కలిసి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on June 2, 2020 12:53 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…