యువి క్రియేషన్స్ వరస్ట్ బేనర్.. ఈ మధ్య ట్విట్టర్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. ఈ పని చేసింది ప్రభాస్ అభిమానులే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాహో మొదలైన దగ్గర్నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది. అభిమానుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ సంస్థ సమయానుకూలంగా అప్ డేట్స్ ఇవ్వదని, వారి కోసం కానుకలేమీ రెడీ చేయదని వాళ్లు మండిపడుతుంటారు.
ఈ విషయంలో ప్రొడక్షన్ హౌజ్ ఆఫీస్ వద్దకెళ్లి గొడవ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. అయినా ఆ సంస్థ ప్రభాస్ కొత్త సినిమా విషయంలోనూ అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లు నడుచుకోవట్లేదు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ 70-80 శాతం పూర్తయినా ఇప్పటిదాకా టైటిల్ ప్రకటించలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ లేదు. వాటి గురించి అప్ డేట్ కూడా లేదు.
ఐతే ఈ మధ్య ప్రభాస్ అభిమానులు మరోసారి విరుచుకుపడేసరికి.. ఆ సంస్థ స్పందించింది. లాక్ డౌన్ ముగిసి, సినీ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాక అప్ డేట్ ఉంటుందని తెలిపింది. లాక్ డౌన్ సడలింపులిచ్చి షూటింగ్స్ త్వరలోనే పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సంస్థ మాట నిలుపుకోనుంది. సోమవారం చిత్ర పీఆర్ వర్గాలు ఈ మేరకు అభిమానులకు ఇన్ పుట్స్ ఇచ్చాయి.
జూన్ ప్రభాస్ అభిమానుల నెల అని.. వారికి కానుక సిద్ధమవుతోందని కొందరు టాలీవుడ్ పీఆర్వోలు సంకేతాలిచ్చారు. బహుశా ఈ నెల మధ్యలో టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశముంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రాధేశ్యామ్, జాన్ అనే టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. యువి వాళ్లతో కలిసి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on June 2, 2020 12:53 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…