బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పోలీసులకు పట్టుబడ్డారు. ముంబై నుంచి గోవాకి వెళ్తున్న ఓ ప్రైవేట్ క్రూజ్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో పోలీసులు దాడి చేసి.. అక్కడ డ్రగ్స్ మత్తులో పార్టీ చేసుకుంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అందులో షారుఖ్ ఖాన్ కొడుకు కూడా ఉన్నాడు. అతడితో పాటు మొత్తం ఎనిమిది మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు.
అయితే కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నానని.. ఆర్యన్ ఎన్సీబీ అధికారులకు తెలిపాడు. ఇన్వెస్టిగేషన్ సమయంలో అతడు ఏడుస్తూనే ఉన్నాడని సమాచారం. ఇండియాలోనే కాకుండా లండన్, దుబాయ్ ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు చెప్పాడు. కస్టడీలో ఉన్న తన కొడుకుతో రెండు నిమిషాల పాటు మాట్లాడి అక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు షారుఖ్.
నేటితో ఆర్యన్ కస్టడీ ముగియనుంది. ఇప్పటివరకు ఆర్యన్ పై డ్రగ్స్ వినియోగ ఆరోపణలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ నేరానికి శిక్షగా రూ.20,000 లేదా ఒక ఏడాది జైలుకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాడు ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే ఈరోజు సాధారణ కోర్టులో ఆర్యన్ బెయిల్ కోసం దరఖాస్తు చేస్తానని చెప్పారు.
This post was last modified on October 4, 2021 3:28 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…