యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్లోనే అత్యంత ఆలస్యమైన చిత్రం.. ఆరడుగుల బుల్లెట్. ఏడెనిమిదేళ్ల కిందట ప్రారంభోత్సవం జరుపుకుని, సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు అక్టోబరు 8న ‘ఆరడుగుల బుల్లెట్’ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేశారు. అది చూస్తే ఇది పక్కా మాస్ మసాలా మూవీ అని.. కమర్షియల్ మీటర్లో తెరకెక్కిందని అర్థమవుతోంది.
ఏ బాధ్యతా లేకుండా ఆవారాగా తిరిగే హీరో.. పనికి మాలిన వాడంటూ అతణ్ని తిడుతూ ఉండే తండ్రి.. మధ్యలో హీరో ప్రేమించే ఒక అందమైన అమ్మాయి.. ఇలా మామూలుగా హీరో జీవితం సాగిపోతుండగా.. అతడి తండ్రికి ఒక సమస్య వస్తుంది. బెజవాడను తన గుప్పెట్లో ఉంచుకున్న విలన్.. హీరో తండ్రికి సంబంధించిన ఆస్తి మీద కన్నేస్తాడు. ఆ క్రమంలో అతడిపై చేయి చేసుకుంటాడు. దీంతో హీరోకు వెర్రెత్తిపోయి తండ్రిని కొట్టిన విలన్ తాట తీస్తాడు. దీంతో విలన్, అతడి గ్యాంగ్ హీరోను టార్గెట్ చేసి.. తమ సత్తా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో హీరో వారిని ఎలా ఎదుర్కొన్నాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది ఈ కథ.
గోపీచంద్ నుంచి ఆశించే మాస్, యాక్షన్ అంశాలకు లోటు లేని సినిమాలా కనిపిస్తోందిది. ట్రైలర్ నిండా మాస్ను ఆకర్షించే అంశాలే కనిపించాయి. కాకపోతే ఈ తరహా సినిమాలు ఇప్పటికే బోలెడన్ని చూశాం. కొత్తదనం అంటూ ఏమీ కనిపించలేదు. చాలా ఏళ్ల కిందట తెరకెక్కిన సినిమా కావడంతో కథాకథనాలే కాదు.. ఆర్టిస్టుల లుక్స్ సైతం పాతగా అనిపిస్తున్నాయి. మరి ఈ ‘పాత’ సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు ఏమేర రుచిస్తుందో చూడాలి. వక్కంతం వంశీ కథతో బి.గోపాల్ రూపొందించిన ఈ చిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్నందించాడు.
This post was last modified on October 4, 2021 1:56 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…