యాక్షన్ హీరో గోపీచంద్ కెరీర్లోనే అత్యంత ఆలస్యమైన చిత్రం.. ఆరడుగుల బుల్లెట్. ఏడెనిమిదేళ్ల కిందట ప్రారంభోత్సవం జరుపుకుని, సెట్స్ మీదికి వెళ్లిన ఈ చిత్రం ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు అక్టోబరు 8న ‘ఆరడుగుల బుల్లెట్’ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్ సైతం రిలీజ్ చేశారు. అది చూస్తే ఇది పక్కా మాస్ మసాలా మూవీ అని.. కమర్షియల్ మీటర్లో తెరకెక్కిందని అర్థమవుతోంది.
ఏ బాధ్యతా లేకుండా ఆవారాగా తిరిగే హీరో.. పనికి మాలిన వాడంటూ అతణ్ని తిడుతూ ఉండే తండ్రి.. మధ్యలో హీరో ప్రేమించే ఒక అందమైన అమ్మాయి.. ఇలా మామూలుగా హీరో జీవితం సాగిపోతుండగా.. అతడి తండ్రికి ఒక సమస్య వస్తుంది. బెజవాడను తన గుప్పెట్లో ఉంచుకున్న విలన్.. హీరో తండ్రికి సంబంధించిన ఆస్తి మీద కన్నేస్తాడు. ఆ క్రమంలో అతడిపై చేయి చేసుకుంటాడు. దీంతో హీరోకు వెర్రెత్తిపోయి తండ్రిని కొట్టిన విలన్ తాట తీస్తాడు. దీంతో విలన్, అతడి గ్యాంగ్ హీరోను టార్గెట్ చేసి.. తమ సత్తా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో హీరో వారిని ఎలా ఎదుర్కొన్నాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నది ఈ కథ.
గోపీచంద్ నుంచి ఆశించే మాస్, యాక్షన్ అంశాలకు లోటు లేని సినిమాలా కనిపిస్తోందిది. ట్రైలర్ నిండా మాస్ను ఆకర్షించే అంశాలే కనిపించాయి. కాకపోతే ఈ తరహా సినిమాలు ఇప్పటికే బోలెడన్ని చూశాం. కొత్తదనం అంటూ ఏమీ కనిపించలేదు. చాలా ఏళ్ల కిందట తెరకెక్కిన సినిమా కావడంతో కథాకథనాలే కాదు.. ఆర్టిస్టుల లుక్స్ సైతం పాతగా అనిపిస్తున్నాయి. మరి ఈ ‘పాత’ సినిమా ఇప్పుడు ప్రేక్షకులకు ఏమేర రుచిస్తుందో చూడాలి. వక్కంతం వంశీ కథతో బి.గోపాల్ రూపొందించిన ఈ చిత్రాన్ని తాండ్ర రమేష్ నిర్మించాడు. మణిశర్మ సంగీతాన్నందించాడు.
This post was last modified on October 4, 2021 1:56 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…