Movie News

ట్వీట్ పెట్టిన సాయి ధరమ్ తేజ్.. ఖుషీలో ఫ్యాన్స్!

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ తరువాత తేజు షాక్ లోకి వెళ్లిపోవడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే విషయంలో హాస్పిటల్ వర్గాలు, మెగాఫ్యామిలీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా నాగబాబు త్వరలోనే తేజ్ మన ముందుకు వస్తాడని చెప్పగా.. ‘కొండపొలం’ సినిమా ప్రమోషన్స్ లో వైష్ణవ్ తేజ్ కూడా తన అన్నయ్య ఆరోగ్యంపై స్పందించాడు.

అయితే ఇప్పుడు ఏకంగా సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం వైరల్ గా మారింది. ”నా మీద, ‘రిపబ్లిక్’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకి, అభిమానానికి థాంక్స్ చెప్పడమనేది చాలా చిన్న పదం. త్వరలోనే మీ ముందుకొస్తా” అంటూ ట్వీట్ చేశారు ధరమ్ తేజ్. అలానే థంబ్సప్ సింబల్ చూపిస్తూ ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.

‘అన్నా వచ్చేశావా..? నీరాక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వీడియో బైట్ పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవలే ఈ మెగాహీరో నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. దీనికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నిజాయితీ గల సినిమా తీశారంటూ దర్శకుడ్ని, సాయి ధరమ్ తేజ్ ని పొగిడారు.

This post was last modified on October 3, 2021 6:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

10 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago