ప్రస్తుతం ఇండియాలో అత్యధిక అంచనాలున్న సినిమా అంటే ఆర్ఆర్ఆర్యే. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా కావడమే ఆ అంచనాలకు కారణం. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం కేవలం ప్రేక్షకులే కాదు.. వివిధ ఇండస్ట్రీల జనాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని బట్టి మిగతా చిత్రాల రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబరు 13న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నపుడు అదే తేదీకి మైదాన్ సినిమా షెడ్యూల్ అయి ఉండటంతో దాని నిర్మాత బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఐతే కరోనా కారణంగా ఆ తేదీకి రెండు చిత్రాలూ విడుదల కాలేదు కాబట్టి ఇబ్బంది లేకపోయింది.
ఐతే ఇప్పుడు ఆర్ఆర్ఆర్కు ప్రకటించిన కొత్త తేదీ విషయంలోనూ అభ్యంతరాలు తప్పేలా లేవు. కొన్ని రోజుల కిందటే హిందీ చిత్రం గంగూబాయి కతియావాడీని 2022 జనవరి 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అది ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా. సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. దానికి రిలీజ్ డేట్ ఇచ్చిన కొన్ని రోజులకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ను జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులోనూ ఆలియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్పై హిందీ మార్కెట్లోనూ భారీ అంచనాలున్న నేపథ్యంలో గంగూబాయి చిత్రానికి ఇబ్బందులు తప్పవు.
ఐతే ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది ఆ సినిమానే కాబట్టి.. ఇలా తమపైకి పోటీకి రావడం ఎంత వరకు న్యాయమన్న ప్రశ్న ఆ యూనిట్ నుంచి తలెత్తొచ్చు. ఇది ఆలియాకు కూడా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ వేసవికి బెర్తులు ఫుల్ అయిపోయాయి. సంక్రాంతి సమయంలోనూ ఖాళీ లేదు. దీంతో అన్నీ చూసుకుని జనవరి 7న రిలీజ్ డేట్గా ఎంచుకుంది ఆర్ఆర్ఆర్ టీం. కాబట్టి గంగూబాయి చిత్రాన్నే వాయిదా వేస్తారా.. లేక ఆర్ఆర్ఆర్ మీద పోటీకి నిలబెడతారా అన్నది చూడాలి.
This post was last modified on October 2, 2021 8:54 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…