ప్రస్తుతం ఇండియాలో అత్యధిక అంచనాలున్న సినిమా అంటే ఆర్ఆర్ఆర్యే. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా కావడమే ఆ అంచనాలకు కారణం. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం కేవలం ప్రేక్షకులే కాదు.. వివిధ ఇండస్ట్రీల జనాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని బట్టి మిగతా చిత్రాల రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబరు 13న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నపుడు అదే తేదీకి మైదాన్ సినిమా షెడ్యూల్ అయి ఉండటంతో దాని నిర్మాత బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఐతే కరోనా కారణంగా ఆ తేదీకి రెండు చిత్రాలూ విడుదల కాలేదు కాబట్టి ఇబ్బంది లేకపోయింది.
ఐతే ఇప్పుడు ఆర్ఆర్ఆర్కు ప్రకటించిన కొత్త తేదీ విషయంలోనూ అభ్యంతరాలు తప్పేలా లేవు. కొన్ని రోజుల కిందటే హిందీ చిత్రం గంగూబాయి కతియావాడీని 2022 జనవరి 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అది ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా. సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. దానికి రిలీజ్ డేట్ ఇచ్చిన కొన్ని రోజులకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ను జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులోనూ ఆలియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్పై హిందీ మార్కెట్లోనూ భారీ అంచనాలున్న నేపథ్యంలో గంగూబాయి చిత్రానికి ఇబ్బందులు తప్పవు.
ఐతే ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది ఆ సినిమానే కాబట్టి.. ఇలా తమపైకి పోటీకి రావడం ఎంత వరకు న్యాయమన్న ప్రశ్న ఆ యూనిట్ నుంచి తలెత్తొచ్చు. ఇది ఆలియాకు కూడా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ వేసవికి బెర్తులు ఫుల్ అయిపోయాయి. సంక్రాంతి సమయంలోనూ ఖాళీ లేదు. దీంతో అన్నీ చూసుకుని జనవరి 7న రిలీజ్ డేట్గా ఎంచుకుంది ఆర్ఆర్ఆర్ టీం. కాబట్టి గంగూబాయి చిత్రాన్నే వాయిదా వేస్తారా.. లేక ఆర్ఆర్ఆర్ మీద పోటీకి నిలబెడతారా అన్నది చూడాలి.
This post was last modified on October 2, 2021 8:54 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…