ప్రస్తుతం ఇండియాలో అత్యధిక అంచనాలున్న సినిమా అంటే ఆర్ఆర్ఆర్యే. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా కావడమే ఆ అంచనాలకు కారణం. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం కేవలం ప్రేక్షకులే కాదు.. వివిధ ఇండస్ట్రీల జనాలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని బట్టి మిగతా చిత్రాల రిలీజ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అక్టోబరు 13న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నపుడు అదే తేదీకి మైదాన్ సినిమా షెడ్యూల్ అయి ఉండటంతో దాని నిర్మాత బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఐతే కరోనా కారణంగా ఆ తేదీకి రెండు చిత్రాలూ విడుదల కాలేదు కాబట్టి ఇబ్బంది లేకపోయింది.
ఐతే ఇప్పుడు ఆర్ఆర్ఆర్కు ప్రకటించిన కొత్త తేదీ విషయంలోనూ అభ్యంతరాలు తప్పేలా లేవు. కొన్ని రోజుల కిందటే హిందీ చిత్రం గంగూబాయి కతియావాడీని 2022 జనవరి 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అది ఆలియా భట్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా. సంజయ్ లీలా బన్సాలీ ఈ చిత్రాన్ని రూపొందించాడు. దానికి రిలీజ్ డేట్ ఇచ్చిన కొన్ని రోజులకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ను జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులోనూ ఆలియా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్పై హిందీ మార్కెట్లోనూ భారీ అంచనాలున్న నేపథ్యంలో గంగూబాయి చిత్రానికి ఇబ్బందులు తప్పవు.
ఐతే ముందు రిలీజ్ డేట్ ప్రకటించింది ఆ సినిమానే కాబట్టి.. ఇలా తమపైకి పోటీకి రావడం ఎంత వరకు న్యాయమన్న ప్రశ్న ఆ యూనిట్ నుంచి తలెత్తొచ్చు. ఇది ఆలియాకు కూడా ఇబ్బంది కలిగించే విషయమే. కానీ వేసవికి బెర్తులు ఫుల్ అయిపోయాయి. సంక్రాంతి సమయంలోనూ ఖాళీ లేదు. దీంతో అన్నీ చూసుకుని జనవరి 7న రిలీజ్ డేట్గా ఎంచుకుంది ఆర్ఆర్ఆర్ టీం. కాబట్టి గంగూబాయి చిత్రాన్నే వాయిదా వేస్తారా.. లేక ఆర్ఆర్ఆర్ మీద పోటీకి నిలబెడతారా అన్నది చూడాలి.
This post was last modified on October 2, 2021 8:54 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…