సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా.. దానికి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. టీజర్ లో మహేష్ చాలా క్లాస్ లుక్ తో కనిపించారు. అలా అని సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఉండేవేమో అనుకుంటే పొరపాటే. దర్శకుడు పరశురామ్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. మాస్ ఆడియన్స్ కి తగ్గట్లుగానే కొన్ని సీన్లు డిజైన్ చేసుకుంటున్నాడట.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాస్ కి నచ్చేలా.. చాలా ఎనర్జిటిక్ గా డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. వైజాగ్ లో సింహాచలం దేవాలయం నేపథ్యంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. అలానే పతాక సన్నివేశాలు కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ లో అయితే విలన్ సముద్రఖనికి మహేష్ బాబు వరహావతారంలో కనిపిస్తారట. ఆ సీన్ తో విశ్రాంతి కార్డ్ పడబోతుంది.
అయితే ఇప్పటివరకు మహేష్ బాబు పౌరాణిక గెటప్ లో కనిపించిందిలేదు. ఆ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా ఆయన ఒప్పుకోరు. ఆ గెటప్ మహేష్ కి ఎంతవరకు సూట్ అవుతుందనే విషయంలో సందేహాలు ఉన్నాయి. అందుకే పరశురామ్ ఈ సీన్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడట. ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రాకపోతే గనుక సినిమా సంక్రాంతికి రావడం పక్కా. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on October 2, 2021 4:18 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…