సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా.. దానికి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. టీజర్ లో మహేష్ చాలా క్లాస్ లుక్ తో కనిపించారు. అలా అని సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఉండేవేమో అనుకుంటే పొరపాటే. దర్శకుడు పరశురామ్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. మాస్ ఆడియన్స్ కి తగ్గట్లుగానే కొన్ని సీన్లు డిజైన్ చేసుకుంటున్నాడట.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాస్ కి నచ్చేలా.. చాలా ఎనర్జిటిక్ గా డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. వైజాగ్ లో సింహాచలం దేవాలయం నేపథ్యంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. అలానే పతాక సన్నివేశాలు కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ లో అయితే విలన్ సముద్రఖనికి మహేష్ బాబు వరహావతారంలో కనిపిస్తారట. ఆ సీన్ తో విశ్రాంతి కార్డ్ పడబోతుంది.
అయితే ఇప్పటివరకు మహేష్ బాబు పౌరాణిక గెటప్ లో కనిపించిందిలేదు. ఆ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా ఆయన ఒప్పుకోరు. ఆ గెటప్ మహేష్ కి ఎంతవరకు సూట్ అవుతుందనే విషయంలో సందేహాలు ఉన్నాయి. అందుకే పరశురామ్ ఈ సీన్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడట. ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రాకపోతే గనుక సినిమా సంక్రాంతికి రావడం పక్కా. మరేం జరుగుతుందో చూడాలి!
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…