సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా.. దానికి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. టీజర్ లో మహేష్ చాలా క్లాస్ లుక్ తో కనిపించారు. అలా అని సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఉండేవేమో అనుకుంటే పొరపాటే. దర్శకుడు పరశురామ్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. మాస్ ఆడియన్స్ కి తగ్గట్లుగానే కొన్ని సీన్లు డిజైన్ చేసుకుంటున్నాడట.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాస్ కి నచ్చేలా.. చాలా ఎనర్జిటిక్ గా డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. వైజాగ్ లో సింహాచలం దేవాలయం నేపథ్యంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. అలానే పతాక సన్నివేశాలు కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ లో అయితే విలన్ సముద్రఖనికి మహేష్ బాబు వరహావతారంలో కనిపిస్తారట. ఆ సీన్ తో విశ్రాంతి కార్డ్ పడబోతుంది.
అయితే ఇప్పటివరకు మహేష్ బాబు పౌరాణిక గెటప్ లో కనిపించిందిలేదు. ఆ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా ఆయన ఒప్పుకోరు. ఆ గెటప్ మహేష్ కి ఎంతవరకు సూట్ అవుతుందనే విషయంలో సందేహాలు ఉన్నాయి. అందుకే పరశురామ్ ఈ సీన్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడట. ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రాకపోతే గనుక సినిమా సంక్రాంతికి రావడం పక్కా. మరేం జరుగుతుందో చూడాలి!
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…