సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా.. దానికి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. టీజర్ లో మహేష్ చాలా క్లాస్ లుక్ తో కనిపించారు. అలా అని సినిమాలో మాస్ ఎలివేషన్స్ ఉండేవేమో అనుకుంటే పొరపాటే. దర్శకుడు పరశురామ్ కి మాస్ పల్స్ బాగా తెలుసు. మాస్ ఆడియన్స్ కి తగ్గట్లుగానే కొన్ని సీన్లు డిజైన్ చేసుకుంటున్నాడట.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మాస్ కి నచ్చేలా.. చాలా ఎనర్జిటిక్ గా డిజైన్ చేసుకున్నట్లు సమాచారం. వైజాగ్ లో సింహాచలం దేవాలయం నేపథ్యంలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. అలానే పతాక సన్నివేశాలు కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారట. ఇంటర్వెల్ సీన్ లో అయితే విలన్ సముద్రఖనికి మహేష్ బాబు వరహావతారంలో కనిపిస్తారట. ఆ సీన్ తో విశ్రాంతి కార్డ్ పడబోతుంది.
అయితే ఇప్పటివరకు మహేష్ బాబు పౌరాణిక గెటప్ లో కనిపించిందిలేదు. ఆ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా ఆయన ఒప్పుకోరు. ఆ గెటప్ మహేష్ కి ఎంతవరకు సూట్ అవుతుందనే విషయంలో సందేహాలు ఉన్నాయి. అందుకే పరశురామ్ ఈ సీన్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడట. ఈ ఎపిసోడ్ మొత్తం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రాకపోతే గనుక సినిమా సంక్రాంతికి రావడం పక్కా. మరేం జరుగుతుందో చూడాలి!
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…