మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడింది. ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఓవైపు ప్రకాష్ రాజ్.. ఇంకోవైపు మంచు విష్ణు ప్యానెళ్లు అస్త్ర శస్త్రాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. పోటీలో వేరే వాళ్లు కూడా ఉన్నప్పటికీ వాళ్లు నామమాత్రమే. ప్రధానంగా వీరి ప్యానెళ్ల మధ్యే పోటీ జరగబోతోంది. ఇండిపెండెంట్గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీలో నిలిచిన బండ్ల గణేష్ సైతం నామినేషన్ను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.
దీంతో పోటీ రెండు ప్యానెళ్ల మధ్యే కేంద్రీకృతం కానుంది. మరి ‘మా’ సభ్యులు ఈ ప్యానెళ్లలో ఎవరి వైపు నిలుస్తారన్నది ఆసక్తికరం. ఈసారి ‘మా’ ఎన్నికలు రాజకీయ రంగు కూడా పులుముకోవడం.. దాని ప్రాతిపదికనే ఓట్లు కూడా పడే సూచనలు కనిపిస్తుండటం గమనార్హం. ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా మారింది.
ఇటీవల ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవన్.. వైకాపా సర్కారును టార్గెట్ చేయడం తెలిసిందే. పవన్ను టార్గెట్ చేయబోయి ఇండస్ట్రీని ఇబ్బందుల్లో పెట్టారంటూ ఏపీలో వైకాపా సర్కారు మీద ఇండస్ట్రీలో మెజారిటీ జనాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ పైకి తమ అసంతృప్తిని వెళ్లగక్కే సాహసం చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో జగన్ కుటుంబానికి సన్నిహితుడైన మంచు విష్ణు ఎన్నికల బరిలో నిలిచాడు. ఆయన ప్యానెల్లోనూ కొందరు వైకాపా మద్దతుదారులున్నారు. పైగా వైసీపీ ప్రభుత్వం మీద పవన్ చేసిన వ్యాఖ్యలను మంచు విష్ణు ఖండించడం గమనార్హం. దీనికి బదులుగా ప్రకాష్ రాజ్.. మంచు విష్ణును తప్పుబట్టాడు.
ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలు జనసేన వెర్సస్ వైకాపా తరహాలో తయారైన పరిస్థితి తలెత్తింది. పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీకి మద్దతుగా నిలిచేవాళ్లంతా ప్రకాష్ రాజ్ వైపు నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. మిగతా వాళ్లు మంచు విష్ణు వైపు నిలవనున్నారు. కాబట్టి ‘మా’ ఎన్నికల్లో జనసేన వెర్సస్ వైకాపా వార్ క్లియర్ అన్నమాటే.
This post was last modified on October 2, 2021 12:09 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…