సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య నటించిన ఓ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజవుతుందని రెండేళ్ల ముందు అంటే అందరూ నవ్వే వాళ్లేమో. కానీ గత ఏడాది కరోనా పుణ్యమా అని సూర్య సినిమా సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్ ప్రైమ్లో రిలీజైంది. ఆ సమయానికి సౌత్ ఇండియాలో ఓటీటీ ద్వారా రిలీజైన అతి పెద్ద సినిమా అదే.
ఈ సినిమాను ఇలా రిలీజ్ చేయడం పట్ల తమిళ ఎగ్జిబిటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా సూర్య తగ్గలేదు. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడి థియేటర్లలోనే కొత్త చిత్రాలు రిలీజవుతున్నప్పటికీ.. ప్రైమ్లో వరుసగా సినిమాలు రిలీజ్ చేయడానికి డీల్ కుదుర్చుకుని తన ప్రొడక్షన్ నుంచి ఒక్కో చిత్రం వదులుతున్నాడు సూర్య.
అతడి నిర్మాణంలో తెరకెక్కిన రారా అనే చిన్న సినిమాను ఇటీవలే ప్రైమ్లో రిలీజ్ చేశాడు సూర్య. దీని తర్వాత తాను హీరోగా నటించిన సినిమాను రిలీజ్కు రెడీ చేశాడు.
జై భీమ్ పేరుతో సూర్య హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇదొక హార్డ్ హిట్టింగ్ డ్రామా అనే విషయం దీని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమైంది.
అమేజాన్ ప్రైమ్తో ఒకేసారి నాలుగు సినిమాలకు డీల్ చేసుకున్న సూర్య… ఇందులో భాగంగా రెండో చిత్రంగా జై భీమ్ను ఈ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాడు. అక్టోబరు 2న ఈ చిత్రం రిలీజవుతుందని సూర్య స్వయంగా ప్రకటించాడు.
జ్ఞానవేల్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్య, జ్యోతిక కలిసి జై భీమ్ను నిర్మించారు. తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. సూరారై పొట్రుతో అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సూర్య.. ఈ చిత్రంతో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి మరి.
This post was last modified on October 1, 2021 9:00 pm
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఎన్నికల గుర్తుల కేటాయింపు విషయంలో కొంత రిలీఫ్ దక్కింది. కానీ, ఇదేసమయంలో కూటమి పార్టీల…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా భారీ బడ్జెట్…
వరుసగా ఫెయిల్యూర్లు ఎదురవుతున్నప్పటికీ టాలీవుడ్లో విజయ్ దేవరకొండ జోరైతే ఏమీ తగ్గట్లేదు. అతడితో సినిమా చేయడానికి దర్శకులు, నిర్మాతలు బాగానే…
వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో…
టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం క్లాసిక్స్ గా ప్రత్యేకమైన చోటు దక్కించుకునే అల్లూరి సీతారామరాజు ఇవాళ 50 వసంతంలోకి అడుగు…
గౌతమీపుత్ర శాతకర్ణి ద్వారా పీరియాడిక్ సినిమాలను తాను ఎంత బాగా డీల్ చేయగలనో నిరూపించుకున్నాక దర్శకుడు క్రిష్ రూటే మారిపోయింది.…