సౌత్ ఇండియన్ సూపర్ స్టార్లలో ఒకడైన సూర్య నటించిన ఓ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజవుతుందని రెండేళ్ల ముందు అంటే అందరూ నవ్వే వాళ్లేమో. కానీ గత ఏడాది కరోనా పుణ్యమా అని సూర్య సినిమా సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్ ప్రైమ్లో రిలీజైంది. ఆ సమయానికి సౌత్ ఇండియాలో ఓటీటీ ద్వారా రిలీజైన అతి పెద్ద సినిమా అదే.
ఈ సినిమాను ఇలా రిలీజ్ చేయడం పట్ల తమిళ ఎగ్జిబిటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా సూర్య తగ్గలేదు. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడి థియేటర్లలోనే కొత్త చిత్రాలు రిలీజవుతున్నప్పటికీ.. ప్రైమ్లో వరుసగా సినిమాలు రిలీజ్ చేయడానికి డీల్ కుదుర్చుకుని తన ప్రొడక్షన్ నుంచి ఒక్కో చిత్రం వదులుతున్నాడు సూర్య.
అతడి నిర్మాణంలో తెరకెక్కిన రారా అనే చిన్న సినిమాను ఇటీవలే ప్రైమ్లో రిలీజ్ చేశాడు సూర్య. దీని తర్వాత తాను హీరోగా నటించిన సినిమాను రిలీజ్కు రెడీ చేశాడు.
జై భీమ్ పేరుతో సూర్య హీరోగా ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సూర్య లాయర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇదొక హార్డ్ హిట్టింగ్ డ్రామా అనే విషయం దీని ఫస్ట్ లుక్ చూస్తేనే అర్థమైంది.
అమేజాన్ ప్రైమ్తో ఒకేసారి నాలుగు సినిమాలకు డీల్ చేసుకున్న సూర్య… ఇందులో భాగంగా రెండో చిత్రంగా జై భీమ్ను ఈ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నాడు. అక్టోబరు 2న ఈ చిత్రం రిలీజవుతుందని సూర్య స్వయంగా ప్రకటించాడు.
జ్ఞానవేల్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్య, జ్యోతిక కలిసి జై భీమ్ను నిర్మించారు. తక్కువ బడ్జెట్లో, తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశారు. సూరారై పొట్రుతో అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సూర్య.. ఈ చిత్రంతో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి మరి.
This post was last modified on October 1, 2021 9:00 pm
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…