Movie News

పవన్ మాటలతో సంబంధం లేదన్నారు.. ఇప్పుడేమో!

సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను నిర్మాతల బృందం కలిసింది. అమరావతిలోని జనసేన కార్యాలయానికి వచ్చిన నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దిల్ రాజు, బన్నీ వాసు, సునీల్ నారంగ్, ఎర్నేని నవీన్ లాంటి ముఖ్య నిర్మాతలు పవన్ ని కలిశారు.

వీరంతా బుధవారం నాడు ఏపీ సమాచార మంత్రి పేర్ని నానిని మచిలీపట్నంలో కలిసిన సంగతి తెలిసిందే. ఒక్క రోజు తేడాతో మళ్లీ పవన్ కళ్యాణ్ ను కలవడానికి మంగళగిరి రావడం ఆసక్తి రేపుతోంది.

ఇటీవల జరిగిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో సినిమా ఇండస్ట్రీ విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తరువాత పవన్ కు ఇండస్ట్రీ వర్గాల మద్దతు లభించలేదు. కొందరు హీరోలు తప్ప మిగిలినవారంతా గమ్మునుండిపోయారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ కూడా వచ్చింది. ఇండస్ట్రీ కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ను ఒంటరి చేశారనే అభిప్రాయాలు వినిపించాయి.

ఇలాంటి సమయంలో నిర్మాతలు అమరావతి వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసి పేర్ని నానితో జరిగిన చర్చల వివరాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందించారో బయటకు రాలేదు. ప్రభుత్వంతో గొడవలు పెట్టుకోవడం కన్నా.. సామరస్యంగా అనుమతులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు పవన్ వ్యాఖ్యలను ఖండించారే తప్ప.. వారు పవన్ కి వ్యతిరేకం కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అరవింద్ కూడా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు.

This post was last modified on October 1, 2021 4:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago