రిపబ్లిక్ సినిమా రిలీజైపోయింది. కానీ ఆ మూవీ ప్రీ రిలీజ్ వేడుకతో తలెత్తిన వివాదం నుంచి మాత్రం ఇండస్ట్రీ ఇంకా రిలీజ్ కాలేదు. జగన్ ప్రభుత్వాన్ని పవన్ కామెంట్ చేయడం.. ఆయనపై పోసాని ధ్వజమెత్తడం తెలిసిందే. ఇప్పుడీ వివాదంలోకి సడెన్గా నట్టికుమార్ ఎంటరయ్యారు.
ఇండస్ట్రీలో ఏం జరిగినా తనంతట తాను స్పందించే వ్యక్తి నట్టికుమార్. ఇప్పుడు పవన్, పోసానిల వివాదం గురించి కూడా ప్రెస్మీట్ పెట్టి మరీ రియాక్టయ్యారు. పోసాని ఇంటిమీద పవన్ ఫ్యాన్స్ దాడి చేయడాన్ని పూర్తిగా తప్పు పట్టారాయన. ఎవరు మాట్లాడినా మధ్యలోకి కుటుంబాలను తీసుకు రావడం కరెక్ట్ కాదని, తమ హీరోలకు మంచి పేరొచ్చేలా అభిమానులు నడచుకోవాలి తప్ప ఇలాంటి పనులు చేయకూడదని అన్నారు. జనసేన నాయకుడు అనవసరంగా ఆంధ్ర, తెలంగాణ అనే తేడాలు తీసుకొస్తున్నారని, అది చాలా తప్పని ఖండించారు నట్టి కుమార్.
జగన్ అందరినీ ఒకేలా చూసే వ్యక్తి అని చెప్పిన నట్టి కుమార్.. పవన్ పెద్ద స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ ఆయన రాజకీయాలకు ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు. కొందరు నిర్మాతలు పవన్కి తప్పుడు సమాచారం ఇస్తున్నారని, చాంబర్ నుంచి రిలీజైన లెటర్ ఎవరో కొందరు మాత్రమే పంపించారు తప్ప అందరూ డిస్కస్ చేసి విడుదల చేసింది కాదని నట్టికుమార్ అన్నారు. దాంతో ఈ కాంట్రవర్శీ కొత్త టర్న్ తీసుకుంది.
This post was last modified on October 1, 2021 2:54 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…